(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా ఉద్యమ సమయం నుంచి తెలంగాణా జాగృతి అంటే కవితక్క….కవితక్క అంటే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూతురు. కవితక్క అంటే….కేటిఆర్ చెల్లి…ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో అందరు తమ కుటుంబ సభ్యురాలిగా అక్కగా పిలుచుకునే వారు….ఇక రాజకీయంగా వేరు కుంపటి పెట్టుకున్న కల్వకుంట్ల కవిత ఇక అమ్మ అని రాజకీయాల్లో ప్రమోట్ చేసుకుంటున్నారు. శనివారం జరిగిన పార్టీ ఆవిర్భావ సదస్సులో పలు మార్లు ఇక అమ్మ లా రాష్ట్ర రాజకీయాలు నడిపిస్తానని, ఆమ్మలా అందరినీ ఆదరిస్తానని చెప్పుకొచ్చారు.
పార్టీ ఏర్పాటు ఖాయమైన నాటి నుంచి కవిత ఆహ భావాలు, డ్రెస్సింగ్ లో పూర్తిగా మార్పులు చేసుకుంది. గతంలో ఎంతో హుందా గా కనిపించే విధంగా వ్యవహరించిన ఆమె ఇప్పుడు సింప్లిసిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల్లో ఇప్పటి వరకు తనకు ఉన్న ఇమేజ్ వేరు…ఇక రాబోయే రోజుల్లో వచ్చే ఇమేజ్ వేరు అన్న చందంగా ఆమె తన వ్యవహార శైలిలో కూడా మార్పులు చేసుకున్నారు. రాజకీయ నేత అయినంత మాత్రానా సాధారణ ప్రజలకు అతీతం కాదనే సంకేతాలు ఆమె ఇస్తున్నారు. ప్రజల్లో మమేకం అయ్యే విధంగా తన స్టైల్ మార్చుకున్నారు. ఓ సాధారణ మధ్య వయస్కురాలైన మహిళ ఎలా ఉంటారో…. అలా తన శైలిని మార్చుకున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు సందర్భంగా కూడా సాధారణ మహిళ నాయకురాలిగా ఆమె వేదిక వద్దకు వచ్చారు.


కవిత వేదికపైకి రాగానే కార్యకర్తలు, నేతలు గతంలో కవితక్క నాయకత్వం వర్దిల్లాలి అనే నినాదాల స్థానంలో కవితమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలు చేశారు. పార్టీ నేతలు, అభిమానుల నినాదాలకు అనుగుణంగా కవిత వేదికపై పలు మార్లు తనకు తాను అమ్మ తనాన్ని చాటి చెప్పుకున్నారు. తెలంగాణా ను ఓ అమ్మలా కాపాడుతానని ప్రకటించారు. అమ్మ తన పిల్లల జేబలు చూడదని, పిల్లల కడుపు చూస్తుందన్నారు. తాను కూడా తెలంగాణా విషయంలో అలాగే వ్యవహరిస్తానని ప్రకటన చేశారు. కవిత తన ప్రసంగంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను విమర్శిస్తూనే…… టీఆర్ ఎస్ పార్టీ గురించి చెప్పుకునే సమయంలో అమ్మ బాధ్యతలను గుర్తు చేస్తూ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
ఏడాది క్రితం కవిత స్టైల్ వేరు…ఇప్పుడు కవిత కనిపిస్తున్న తీరు వేరు. ప్రస్తుతం కనిపిస్తున్న తీరును చూసి కొంత మంది తమిళ నాడు అమ్మ జయలలిత స్టైల్ అనుసరిస్తుందని వ్యాఖ్యలు చేస్తుండగా…మరికొంత మంది సుష్మాస్వరాజ్ ను ఫాలో అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.









Leave a Reply