(చెన్నై,న్యూస్ఇన్)
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కి ఎన్నికల ఫలితాలు మరో సారి నిరాషే పరిచాయి. మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్నా తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ దాట లేకపోయింది. ప్రాంతీయ పార్టీలతో అవగాహన తో పోటీ చేసి 27 స్థానాల్లో బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను బరిలో దించినా….కేవలం ఒక్క స్థానాన్ని మాత్రం తమ ఖాతాలో వేసుకోగలిగింది. అది కూడా వెయ్యి ఓట్ల లోపు మేజర్టీతోనే ఎం. భోజరాజన్ ఉదగమండలం నియోజకవర్గం నుంచి విజయంద క్కించుకున్నారు. 2021 ఎన్నికల్లో నాలుగు స్థానాలున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం అయింది. కేరళలో మూడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. గతంతో పోలిస్తే ఇది కేరళ బీజేపీకి భారీ విజయంగానే చెప్పుకోవచ్చు. తమిళనాడులో ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎన్నికలకు ముందు నుంచే అంటిముట్టనట్లే వ్యవహరించారు. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ మిత్ర పక్షాల కోసం ఆయన ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయం తీసుకున్న ఆయన కింగ్ మేకర్ గా వ్యవహరించాలని భావించారు. కానీ ఎన్నికల తమిళనాడులో బీజేపీ నేతగా ఉన్న అన్నామలై వ్యవహారం తమిళ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. బీజేపీ అగ్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలున్నా…ఆయన చేసిన సూచనలు జాతీయ నాయకత్వం పట్టించుకోకపోవడం, క్షేత్ర స్థాయిలో ద్రవిడ పార్టీలను అడ్డుకోవాలంటే అనుసరించాల్సిన వ్యూహంపై అసెంబ్లీ ఎన్నికలు కావడం, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ కూడా సీరియస్ గా దృష్టి పెట్టకపోవడం వంటి అంశాలు కూడా బీజేపీ వెనుకబాటుకు కారణమయ్యాయి. తెలంగాణా మాజీ గవర్నర్ తమిళిసై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. డీఎంకే ప్రభుత్వంపై పోరాటం చేసి ప్రభుత్వ తీరును అన్నామలైన తన దూకుడుతో ఎండగట్టారు. రాజకీయంగా తమిళ రాష్ట్రంలో పట్టున్న పార్టీ నేతగా కాకున్నా….క్షేత్ర స్థాయి నుంచి పార్టీ క్యాడర్ ను సిద్ధం చేయాలన్న లక్ష్యంగా పావులు కదిపారు. కాని ఎన్నికల సమయంలో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం, రాజకీయంగా సరైన నిర్ణయమే తీసుకున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళ నాడులో బీజేపీ ఆ రాష్ట్రంలో కేవలం నాలుగు స్థానాలకే పరిమితం అయింది. డీఏంకే పార్టీని గద్దె దింపాలని ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని అన్నా మలై చేసిన ప్రచారం బీజేపీ కంటే టీవీకే కే అధికంగా లాభం చేకూర్చింది.

తమిళ నాడు డీఎంకే వ్యతిరేక ఓటు సాధారణంగా ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడిఎంకు వెళ్లాలి. కానీ ఈ సారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీవీకే వైపు మళ్లి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక పవనాలను విజయ్ దళపతి అందిపుచ్చుకున్నారు. ఏఐఏడిఎం దాదాపు గతంలో ఉన్న స్థానాలను దక్కించుకుంది. అన్నామలై ఇచ్చిన మార్పు నినాదం విజయ్ కు కలిసి వచ్చిందని తమిళరాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వంపై దుకుడుగా వెళ్లిన అన్నామలై వ్యవహారం యువతను ఆకర్షించింది. ఇదే సమయంలో సినీ ప్రభావం, యువనేతగా విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో సీనీ గ్లామర్, యూత్ క్రేజీ టీవీకే కు కలిసి వచ్చింది. తమిళ నాడులో మార్పు నినాదం బాగా పనిచేయడంతో టీవీకే విజయం వెనుక బీజేపీ వ్యూహం అన్న చర్చ కూడా మొదలైంది. మొత్తం మీద బీజేపీ నేత అన్నామలై వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తమిళ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది.











Leave a Reply