NewsInn

News in a Click

ద‌ళ‌ప‌తికి షాక్ ఇచ్చిన గ‌వ‌ర్న‌ర్…..!

ద‌ళ‌ప‌తికి షాక్ ఇచ్చిన గ‌వ‌ర్న‌ర్…..!

(చెన్నై,న్యూస్ఇన్‌)

త‌మిళ నాడు ఎన్నిక‌ల్లో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన విజ‌య్ ద‌ళ‌ప‌తి పార్టీ (టీవీకే) ప్ర‌|భుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మై గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి ప్ర‌భుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల‌ని కోరింది. కానీ గ‌వ‌ర్న‌ర్ టీవీకే విజ్ఙ‌ప్తిని తిర‌స్క‌రించి పెద్ద షాక్ ఇచ్చారు.108 సీట్ల‌తో అతిపెద్ద పార్టీగా టీవీకే అవ‌త‌రించింది. మెజార్టీకి అవ‌స‌ర‌మైన స్థానాల‌కు 10 స్థానాలు దూరంలో నిలిచింది. ఈ ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ స‌హా ఇత‌ర పార్టీలు కూడా విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యేందుకు తాము స‌హ‌క‌రిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. దీంతో విజ‌య్ 7వ తేదీన సీఎంగా ప్ర‌మ‌ణ స్వీకారం చేయాల‌న్న ల‌క్ష్యంగా గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశారు. కానీ గ‌వ‌ర్న‌ర్ విజ‌య్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు అనుమ‌తించ‌లేదు.

బీజేపీ వ్యూహం….టీవీకే కు లాభం….

108 స‌భ్యులున్న టీవీకే గ‌వ‌ర్న‌ర్ కు 112 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంద‌న్న జాబితా స‌మ‌ర్పించింది. కానీ గ‌వ‌ర్న‌ర్ దీన్ని అంగీక‌రించ‌లేదు. 118 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంటేనే ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇస్తాన‌ని గ‌వ‌ర్న‌ర్ తేల్చి చెప్ప‌డంతో షాక్ తిన‌డం టీవీకే వంతైంది. త‌మిళ నాడులో కొత్త పార్టీకి సాంకేతిక చిక్కులు మొద‌లు కావ‌డం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. ప్ర‌భుత్వం ఏర్పాటులో ప్ర‌తిష్టంబ‌న నెల‌కొన‌డంతో మ‌రింత స‌మ‌యం తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *