(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి లోని భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేవ పార్టీల అధినేతల నివాసానికి వెళ్లారు. ముందుగా వారి నివాసాలకు వెళ్లే షెడ్యూల్ లేకపోయినా ఒక రోజు ముందుగా ప్రధాని ఖరారైన షెడ్యూల్ ప్రదానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లారు. ప్రధాని మోడీ రావడంతో ఈ ఇద్దరు నేతలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానికి గన స్వాగతం పలికారు. ఇరువురు నేతల కుటుంబ సభ్యులతో మోడీ మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మోడీ కి ఘనంగా స్వాగతం పలికారు.బాబు నివాసానికి వెళ్లిన ప్రధాని బాబుతో ప్రత్యేకంగా కొద్ది సేపు భేటీ అయి తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా వీరి భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే తెలంగాణాలో పావులు కదిపేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్న సంకేతాలను మోడీ ఇచ్చినట్లు తెలుస్తోంది.



పవన్ కళ్యాణ్ ట్విట్…..
ఈ రోజు హైదరాబాద్ లోని నా నివాసానికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేయడం గొప్ప అనుభూతిని కలిగించింది. నా సతీమణి శ్రీమతి అన్నా కొణిదల, మా పిల్లలైన కొణిదల అకీర నందన్, కొణిదల ఆద్య, కొణిదల పోలినా అంజని, మరియు మాస్టర్ కొణిదాల మార్క్ శంకర్లతో కలిసి సాదరంగా స్వాగతం పలికే గొప్ప గౌరవం నాకు దక్కింది.

నా ఆరోగ్య పరిస్థితి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఆయన సహృదయంతో విచ్చేయడం – ఆయనలోని ఆప్యాయత, అనురాగం, మానవతావాద నాయకత్వాన్ని ప్రతిబింబిస్తునాయి. ఆయనకు తీరిక లేని కార్యక్రమాలు, అపారమైన బాధ్యతలు ఉన్నప్పటికీ, సమయం కేటాయించిన ఇంటికి వచ్చి అండనిచ్చారు. గౌరవ ప్రధాన మంత్రి గారు చూపిన ఈ ఆదరణను ఎంతో విలువైనదిగా భావిస్తాను. ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.
ఏప్రిల్ 19న, నా శస్త్రచికిత్స జరిగిన వెంటనే, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా ఫోన్ చేసి నా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు మరియు ఈ క్లిష్ట సమయంలో నాకు హృదయపూర్వక భరోసా, మద్దతును అందించారు. ఇప్పుడు, నేను కోలుకుంటున్న ఈ సమయంలో, నా నివాసానికి ఆయన రావడం అనేది నేను ఎప్పటికీ గుర్తుంచుకునే సందర్భం.
రేవంత్ రెడ్డిని తనతో కలిసి రావాలన్న ప్రధాని…..
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరినీ తమ కుటుంబ సభ్యుల్లా చూస్తారు. ఆయన తన ఆలోచనలు, చేతలలో ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇదే ఆయన్ని నిజంగా విశిష్టమైన వ్యక్తిగా నిలుపుతుంది. దేశానికి నాయకత్వం వహించే అపారమైన బాధ్యతను మోస్తున్నప్పటికీ, ఆయన కరుణ, వ్యక్తిగత శ్రద్ధ, ప్రజలతో ఆయనకున్న భావోద్వేగ అనుబంధం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

ప్రధానమంత్రి గారి శ్రద్ధకు, ఆయన సుహృద్భావంతో కూడిన మాటలకు, మాతో గడిపిన విలువైన సమయానికి నేను ఎంతగానో చలించిపోయాను. శ్రీ నరేంద్ర మోదీ గారి అసాధారణ నాయకత్వం, దేశ ప్రగతి పట్ల అచంచలమైన నిబద్ధతకు మించి, ఆయన వినయం, కరుణ, ప్రజలతో ఆయనకున్న వ్యక్తిగత అనుబంధం భారతదేశవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.
ఆయన ఆశీస్సులు, మార్గదర్శనం, ఆప్యాయమైన మద్దతు నాకు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఈ చిరస్మరణీయ పర్యటనకు, ఆయన నిరంతర మార్గదర్శనానికి, ప్రోత్సాహానికి గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.










Leave a Reply