(హైదరాబాద్,న్యూస్ఇన్)
పోక్సో కేసులో ఇరుక్కున్న కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి తనయుడు బండి భగీరథ బేయిల్ పొందే యత్నాల్లో ఉండడంతో ఈ రోజు విచారణకు హాజరు కాలేదు. పోలీసులు నోటీసులు అందించి ఈ నెల 13వ తేదీన 2 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 14వ తేదీన బేయిల్ పిటీషన్ పై విచారణ ఉండడంతో 15వ వ తేదీన విచారణకు హాజరవుతానని బండి భగీరథ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. పోక్సో కేసుకు సంబంధించి అన్ని ఆధారాలతో సహా ఆ రోజు హాజరై పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తానని మేయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు ప్రభుత్వం సిట్ వేయడంతో కేసు విచారణలో వేగం పెరిగింది. సిట్ అధికారిగా రితిరాజ్ గైక్వాడ్ ను నియమించింది. రితిరాజ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ పోలీసులు ఇప్పటి వరకు తీసుకున్న అన్న అంశాలను పరిశీలించారు. బాధిత యువతి స్టేట్ మెంట్ ను పరిశీలించి బండి భగీరథ కు నోటీసులు జారీ చేశారు.బేయిల్ వస్తుందన్న ధీమాతోనే 15వ తేదీన హజరవుతానని భగీరథ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బండిది కుటుంబ వ్యవహారం….
అయితే నోటీసులపై స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అని ప్రకటించినా….. నేరాన్ని కోర్టులు నిర్ధారిస్తాయన్నారు. తనపై కుట్ర చేసిన వారిని దహించి వేస్తానని వ్యాఖ్యలు చేయడం బీజేపీ పార్టీలో అంతర్గతంగా చర్చ జోరుగా చర్చకు దారి తీస్తోంది. పార్టీ మాత్రం ఈ వ్యవహారం బండి సంజయ్ కుటుంబ వ్యవహారమని చేతులెత్తేసింది. సున్నిత మైన అంశం కావడంతో…పార్టీ నేతలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. బండి భగీరథ పై పోక్సో కేసు నమోదు కావడంతో న్యాయ నిపుణులు అంత సులువుగా బేయిల్ వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే బండి తనయుడి తరపున సీనియర్ న్యాయ వాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో బేయిల్ దక్కడం ఖాయమన్న ధీమా బండి వర్గంలో వ్యక్తం అవుతోంది. మరో వైపు భగీరథ్ కు బేయిల్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

రాజకీయ దూమారం….
భగీరథ్ వ్యవహారం తెలంగాణా రాజకీయాల్లో దూమారం రేపుతోంది. 8వ తేదీన మైనర్ బాలిక ఫిర్యాదు చేసిననాటి నుంచి బండి సంజయ్ తొలిసారి రాజకీయ పార్టీలకు దొరికి ఆత్మరక్షణలో పడ్డట్లు అయింది. బండి దూకుడుతో బేజారయిన బీఆర్ ఎస్ పార్టీ రాజకీయంగా బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో జోరుగా పోస్టులు పెడుతోంది. ఐదు రోజుల తరువాత టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. భగీరథ్ పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బండి కరీంనగర్ లో స్పందించిన తీరు ఆయన డిఫెన్స్ లో పడ్డారనేందుకు ఒక నిర్ధనవరంగా నిలుస్తోంది.











Leave a Reply