(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఇంటర్మీడిట్ విద్యా విధానంలో భారీ మార్పులు చేస్తూ తెలంగాణా సర్కార్ నిర్ణయం తీసుకుంది.సైన్స్ విద్యార్థులకు గతంలో ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్ విధానాన్ని రెండు సంవత్సరాలకు విభజించింది.మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం కొత్త సిలబస్తో పుస్తకాలను నిపుణుల కమిటీ పర్యవేక్షణలో రూపొందించారు. జూన్ 1వ తేదీ నాటికి కొత్త పుస్తకాలను పంపిణీ చేస్తామని ఇంటర్ బోర్డు వెల్లడించింది. జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మే 12 నుండి ప్రారంభమైంది. కొత్త అకడమిక్ ఇయర్ కోసం ‘ACE’ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) పేరుతో సరికొత్త గ్రూపును బోర్డు ప్రవేశ పెట్టింది. ఎంఈసీ (MEC) విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గణిత ప్రశ్నపత్రాన్ని రూపొందించనున్నట్లు బోర్డు తెలిపింది.

ఈ విద్యా సంవత్సరం నుంచే మార్పులు…..
ఇకపై ఫీజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జువాలజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలోను ప్రాక్టీకల్ పరీక్షలు
మొదటి సంవత్సరంలో 15 మార్కులు, రెండో ఏడాది 15 మార్కులకు ప్రాక్టీకల్స్
మ్యాథ్స్ లో యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ ని ప్రవేశపెట్టిన బోర్డు
మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఇంటర్నల్ అస్సెస్మెంట్ కి ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయింపు
మ్యాథమేటిక్స్లో 75 మార్కులకు బదులు 60 మార్కులకు ఫైనల్ పరీక్షలు.
హ్యుమానిటీస్ లో యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ కి 20 మార్కులు.
ఫైనల్ పరీక్షలు 100 మార్కులకు బదులు 80 మార్కులకే నిర్వహణ.
భాషా విభాగాల్లోనూ 100 మార్కులకు బదులు 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు, 20 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్లు
ఈ ఏడాది నుంచి ఇంటర్ కు సిలబస్ లో మార్పులు చేస్తూ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేయనుంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పుస్తకాలను అందచేస్తామని బోర్డు ప్రకటించింది.












Leave a Reply