(హైదరాబాద్,న్యూస్ఇన్)
ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జిల్లాలో ని సాగునీటి ప్రాజెక్టుల పై ఈ భేటీలో ప్రధాన చర్చ జరిగింది. భేటీ సందర్భంగా సీఎం నేతలకు పలు కీలక సూచనలు చేశారు.పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలయినంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని సిఎం హామీ ఇచ్చారు.

జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని తరచూ పర్యవేక్షించాలని ఆదేశించారు.










Leave a Reply