
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
పోక్సో కేసులో అరెస్టు అయి విచారణను ఎదుర్కొంటున్న బండి భగీరథ ను చర్లపల్లి సెంట్రల్ జైల్లో జైలు అధికారులు మరో బ్లాక్ లోకి మార్చినట్లు తెలిసింది. సాధారణ ఖైదీలతోనే మూడు రోజులపాటు ఉన్న భగీరథ ను కావేరి బ్యారక్ లోకి మార్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కేంద్రమంత్రి తనయుడు కావడంతో భద్రతా కారణాలతో సాధారణ ఖైదీల బారక్ నుంచి మరో బ్యారక్ లోకి భగీరథను అధికారులు మార్చారు. మైనర్ బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో భగీరథ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 8వ తేదీన ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా భగీరథ పై పోక్సో కేసును పోలీసు అధికారులు నమోదు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది.









Leave a Reply