(హైదరాబాద్,న్యూస్ ఇన్)
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీల అత్యధికంగా నమోదయ్య అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది రాబోయే వారం రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో మధ్యాహ్నం వేళ పెద్ద ఎత్తున వడగాలి ఇప్పుడు కూడా విజయ్ అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ లను జారీ చేసింది.

ఉత్తర, తూర్పు తెలంగాణలో 45-47°C ఉష్ణోగ్రతలతో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. ఇతర జిల్లాలలో 43-45°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
హైదరాబాద్ – ఉష్ణోగ్రతలు 43°C వరకు చెర్రీ అవకాశం ఉందని చెబుతోంది. ప్రజలు అందుకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వేసవి కారణంగా ఎండా ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
ఇక సాయంత్రం నుండి రాత్రి వరకు రంగారెడ్డి, నల్గొండ, నాగర్కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసాయి. ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన ధాన్యం వర్షాల కారణంగా నాని పోతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈరోజు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.









Leave a Reply