
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నుంచి తమను రక్షించాలని అమీర్ పేట లోని హాస్టల్ నిర్వాహకులు కోరుతున్నారు. గత కొన్ని రోజులుగా అమీర్పేట్లోని ఏసియన్ హాస్టల్ నిర్వాహకుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ భవనం కోసంరూ.2 కోట్ల అడ్వాన్స్ రూపంలో ఖర్చు చేయించి.. హాస్టల్ భవనం అద్దెకిచ్చి.. ఇప్పుడు ఖాళీ చేయాలని వేధించడం మొదలుపెట్టారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తమపై దాడికి యత్నిచారని వాపోయారు.
అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపారని.. 3 రోజుల నుంచి రౌడీలతో హాస్టల్కి వచ్చి అందరినీ భయపెడుతున్నారన్న నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు.బొంతు రామ్మోహన్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమను కాపాడాలంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎంకు విజ్ఞప్తి చేశారు.








Leave a Reply