NewsInn

News in a Click

తెలంగాణలో మండుతున్న ఎండలు….!

(హైదరాబాద్,న్యూస్ ఇన్)

తెలంగాణలో ఈ వేసవి సీజన్‌లో భగభగలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఈ సీజన్లో మొదటి సారిగా ఉష్ణోగ్రతలు 47° నమోదు అయ్యాయి. ఉత్తర తెలంగాణలోని జిల్లాలో 46 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండడం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎల్నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ప్రజలు అని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచనలు చేస్తుంది. మరో నాలుగు ఐదు రోజులు కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచనలు చేసింది.
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.

దిలావర్‌పూర్, నిర్మల్ 46.5°C
ధర్మసాగర్, హన్మకొండ 46.4
చొప్పదండి, కరీంనగర్ 46.4
ఓదెల, పెద్దపల్లి 46.4
రాయికల్, జగిత్యాల 46.3
వడ్లకొండ, జనగాం 46.3
పెనుబలి, ఖమ్మం 46.3
కెబి ఆసిఫాబాద్ 46.3
కోటపల్లి, మంచిర్యాల 46.3
బాల్కొండ, నిజామాబాద్ 46.3
జైనద్, ఆదిలాబాద్ 46.2
పినపాక, బి-కొత్తగూడెం 46.2
తొర్రూర్, మహబూబాబాద్ 46.2
కోహెడ, సిద్దిపేట 46.2
మేళ్లచెరువు, సూర్యాపేట 46.2
ఏటూరునాగారం, ములుగు 46.1
కోనరావుపేట, సిరిసిల్ల 46.1
కట్టంగూర్, నల్గొండ 46
నల్లబెల్లి, వరంగల్ 46
మొగులపల్లి, భూపాలపల్లి 45.8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *