
(పాలమూరు,న్యూస్ఇన్)
మృతదేహం కోసం పోలీసులు వైద్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నత అధికారుల నిర్లక్ష్యం ఈ వాగ్వాదానికి కారణమైంది. బాధ్యతగా విధులు నిర్వహించే అధికారుల మధ్య ఈ వివాదం రాజు కోవడం రాష్ట్రంలోని ఆసుపత్రుల పనితీరుకు అద్దం పట్టేలా కనిపిస్తోంది. మృతదేహం కోసం వైద్యులు పోలీసుల వాగ్వాదం ఎందుకంటే…. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించేందుకే. నమ్మశక్యం కాకపోయినా ఈ ఘటన పాలమూరు జిల్లా గద్వాలలో చోటుచేసుకుంది.
పట్టణంలోని పిల్లిగుండ్ల కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బతో మృతి చెందగా… గద్వాల రూరల్ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్చురీలో ఫ్రీజర్ పనిచేయడం లేదని చెప్పి… మృతదేహాన్ని దాదాపు మూడు గంటల పాటు బయటే పడేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై పోలీసులు ఆరా తీయగా….“వారం రోజులుగా ఫ్రీజర్ పనిచేయకపోతే ఇప్పటివరకు మార్చురీ ఎలా నడుస్తోంది…? అధికారులు ఏం చేస్తున్నారు…?” అంటూ పోలీసులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీయడంతో డాక్టర్లకు, పోలీసులకు మధ్య ఆస్పత్రి ప్రాంగణంలోనే తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
మృతదేహాన్ని వెంటనే మార్చురీలో ఉంచాలని పోలీసులు కోరినా… ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానిక రూరల్ ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.
“మరణించిన వారికైనా గౌరవం దక్కడం లేదా…? ఫ్రీజర్ రిపేర్ చేయించలేని స్థితిలో ఆస్పత్రి ఉందా…?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీ ఫ్రీజర్లు పనిచేయకపోయినా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదా… ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు చేపట్టడం లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
వైద్యులను ప్రశ్నించిన పోలీసులకే ఈ ఘటనలో ప్రజల మద్దతు ఉంది. కనీసం మానవత్వం లేకుండా వైద్యులు వ్యవహరించిన తీరే ఇక్కడ వివాదాస్పదంగా మారింది.






Leave a Reply