NewsInn

News in a Click

హైదరాబాద్‌లో హెచ్ఎండిఏ భూ వేలం

Hmda land auction

(హైదరాబాద్, న్యూస్ఇన్)

హెచ్ఎండీఏ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో భూముల వేలానికి హెచ్ఎండిఏ సిద్ధం అయింది. భూమేల ద్వారా దాదాపు 3 వేల కోట్లు ఆదాయంగా రాబట్టాలని అంచనా వేస్తోంది. పువ్వు వేళానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మొకిల్లాలో 100 ప్లాట్లు, మేడిపల్లిలో 68 ప్లాట్లు, హాకీంపేటలో 8.24 ఎకరాల భూమి వేలానికి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

హాకీంపేటలోని 8.24 ఎకరాల విక్రయం ద్వారా రూ.1,600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తుండగా,మొకిల్లా, మేడిపల్లి ప్లాట్ల విక్రయం ద్వారా రూ.400 కోట్లు రావచ్చని భావిస్తోంది.

మరోవైపు శేరిలింగంపల్లి మండలంలోని చందానగర్లో సర్వే నెంబర్ 174లోని 484 గజాల భూమి, గండిపేట మండలం బైరాగిగూడలోని సర్వే నెంబర్ 57లోని 2,420 గజాల భూమి, నార్సింగి ప్రాంతంలోని సర్వే నెంబర్ 105లో ఉన్న 5,687 గజాల భూమి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గండిమైసమ్మ మండలం భౌరంపేట గ్రామంలోని సర్వే నంబర్ 694లో ఉన్న 2,420 గజాల భూమి, కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం గ్రామంలోని సర్వే నెంబర్ 166, 167లో ఉన్న 4,840 గజాల భూమి, మేడిపల్లి మండలంలోని పీర్జాదిగూడలోని సర్వే నెంబర్ 199లో ఉన్న 2,057 గజాల భూమి, 726 గజాల భూమి విక్రయం ద్వారా రూ.500 కోట్లు ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు.ఈ ఏడు ఖాళీ స్థలాలకు జూన్ 17వ తేదీన వేలం జరుగనుంది.జూన్ 19వ తేదీన హాకీంపేటలోని 8.24 ఎకరాల భూమికి, జూన్ 24వ తేదీన మేడిపల్లిలోని ప్లాట్లకు, 29వ తేదీన మొకిల్లాలోని ప్లాట్లకు వేలం వేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *