(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలోని సివిల్ సర్వీస్ అధికారుల్లో వివాదాస్పద అధికారి ఆకునూరి మురళి మరోసారి ఆలక బూనారు. పదవీ కాలం పూర్తి కాక ముందే విద్యా కమీషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం మరో సారి ఆయన వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం, ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టడం వంటి అంశాలతో బీఆర్ఎస్ సర్కార్ కీలక బాధ్యతలను తప్పించి ప్రాధాన్యత లేని శాఖలకు బదిలీ చేసింది. అసలే అసంతృప్తితో రగిలిన ఆ అధికారి సోషల్ మీడియా వేదికలపై బహిరంగంగానే ప్రభుత్వ తీరును తప్పబట్టడంతో ఆయనకు రాజకీయంగా, వ్యక్తిగతంగా మద్దతు దారులు పెరిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ మురళికి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో…కాంగ్రెస్ అదికారంలోకి వచ్చిన వెంటనే ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ కు చైర్మన్ పదవి ఇచ్చి రాష్ట్రంలో విద్యా విధానంపై నివేదిక ఇస్తూ పలు సూచనలు చేసింది.

అయితే కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా వివాదం రాజుకుంది. ప్రజాప్రతినిదులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు తప్పుబట్టాయి.ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోకపోయినా…విద్యా కమిషన్ చైర్మన్ పదవి మరో మూడు నెలల గడువు ఉన్నా…. మురళి హఠాత్తుగా రాజీనామా చేయడం మరోసారి హాట్ హాట్ గా మారింది. ఈ ప్రభుత్వంలో మరేదైన ఉన్నతి పదవి వరిస్తుందా…లేదంటే కమిషన్ చైర్మన్ గా నియమించినా…. సరైన అధికారాలు ప్రభుత్వం ఇవ్వలేదా అన్నది ఆసక్తి రేపుతోంది. మరో మూడు నెలల్లో ఆయన పదవీ కాలం ముగియ నుంది. ఈ నేపథ్యంలో ముందగానే ఆయన రాజీనామా చేయడం చర్చనీయంశంగా మారింది. ప్రభుత్వ పెద్దల సూచనలతో రాజీనామా చేశారా లేదంటే ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నయా అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. మురళి త్వరలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన రాజీనామా కారణాలను వెల్లడించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.







Leave a Reply