NewsInn

News in a Click

వ‌డ‌దెబ్బ మృతుల‌కు ఎక్స్ గ్రేషియా….!

Summer review telangana government

(హైదరాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో వ‌డ దెబ్బ త‌గిలి ప్రాణాలు కోల్పోతున్న‌వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.నాలుగు రోజుల క్రితం 11 మంది వ‌డ‌దెబ్బ‌కు మృతి చెంద‌గా ఆ త‌రువాతా సంఖ్య మ‌రింత పెరుగుతూ వ‌చ్చింది.అయితే ప్ర‌భుత్వ లెక్క‌ల్లో మాత్రం 7 జిల్లాల్లో16 మంతి వ‌డ‌దెబ్బ‌కు మృత్యు వాత ప‌డ్డార‌ని ప్ర‌భుత్వం తేల్చింది. వ‌డ‌దెబ్బ మృతుల‌కు ఎక్స్ గ్రేషియా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఒక్క‌క్క‌రికి 4 ల‌క్ష‌ల రుపాయాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.

Minister ponguleti Srinivas Reddy
 రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి గారు  శ‌నివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్ పరిస్థితులపై జిల్లాల వారీగా నివేదికలను పరిశీలించి, ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యంతో పనిచేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జిల్లాల క‌లెక్టర్ల నివేదిక ప్రకారం జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో న‌లుగురు, వ‌రంగ‌ల్ అర్బన్‌, క‌రీంన‌గ‌ర్‌,  నిజామాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున జోగులాంబ గ‌ద్వాల్‌, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో  ఒక్కరు చొప్పున  ఏడు జిల్లాల్లో 16 మంది వ‌డ‌దెబ్బతో మృతి చెందార‌ని అధికారులు మంత్రిగారి  దృష్టికి తీసుకువ‌చ్చారు.  దీనిపై మంత్రి గారు స్పందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు వ‌డదెబ్బ మృతు కుటుంబాల‌కు నాలుగు లక్షల రూపాయిల చొప్పున న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌ని ఇందుకు సంబంధించిన ప్రక్రియ‌ను త్వరిత గ‌తిన పూర్తిచేయాల‌ని ఆదేశించారు.

ఎండల తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంటోంది. తీవ్రస్థాయి ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజల ప్రాణాల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావుండకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలని మీడియా, సోషల్ మీడియా, గ్రామస్థాయి ప్రకటనల ద్వారా ఎండలపై అప్రమత్తత కల్పించాలని ప్రజలకు అవసరమైన సమాచారం ప్రతి గంటకు చేరేలా చర్యలు తీసుకోవాలని అని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత కోసం అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కోరారు.వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం ఈనెల 26వ‌ర‌కు కరీంనగర్‌, పెద్దప‌ల్లి, జయశంకర్ భూపాలపల్లి,ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత, తీవ్రమైన ఉష్ణోగ్రతలు మరియు వడగాల్పులు కొనసాగుతాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింద‌ని ఈ జిల్లాల క‌లెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక చ‌ర్యలు తీసుకోవాల‌ని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *