
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు పాఠశాలల అభివృద్ధికి మూడు సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యా శాఖతో రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ ఒప్పందం పూర్తి చేసుకున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి కి ఒప్పంద పత్రాలను రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. రహేజా, రామ్ కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోదా గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు లు సీఎం కు అందచేశారు.రంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల కోసం అవసరమైన 50.50 కోట్ల లను భరించనున్న రహేజా గ్రూప్ భరించనుంది.రాంకీ సంస్థ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల కొత్త ప్రాంగణానికి మొత్తం ఖర్చు లో 40% అంటే రూ. 19.66 కోట్లు వెచ్చించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ZPHS పాఠశాలను ప్రీ ప్రైమరీ నుంచి ఐదవ తరగతి, ఇంటర్ తరగతుల నిర్మాణం కోసం మొత్తం ఖర్చు లో 40% అంటే రూపాయలు 10.4 కోట్లు భరించనున్న రాంకీ సంస్థ ఒప్పందం చేసుకుంది.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్ నగర్ MPPS లో ప్రీ ప్రైమరీ, 6,7వ తరగతుల కోసం అవసరమైన 12.20 కోట్ల ను భరించనున్న యశోదా ఫౌండేషన్ ఒప్పందం చేసుకుంది.








Leave a Reply