(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఆంధ్రా ప్రాంత ప్రజల హక్కుల కోసం అవసరం అయితే పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కవిత ఆరోపించారు. అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.తెలంగాణ అమరుల ఆకాంక్షలు, ఉద్యమకారుల పోరాటం ఫలితంగా ఏర్పడిన తెలంగాణపై ఆంధ్రా నాయకుల పెత్తనాన్ని సహించబోమని టీఆర్ఎస్ ఛీప్ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన “ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన” పై రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ఎలాంటి విబేధాలు లేకుండా కలిసే ఉన్నారని గుర్తు చేశారు. కానీ రాజకీయ నాయకులే తెలంగాణ ఆస్తిత్వంపై దాడి చేస్తూ పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ రక్షణ సేన మాత్రమే కాపాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే ఇక్కడ ఉన్న ఆంధ్రా నేతల విగ్రహాలను ఆంధ్రాకు పార్సల్ చేస్తామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో ఆంధ్రా రాజకీయ నేతల ఏజెంట్ సీఎంగా ఉండటంతో మళ్లీ ఈ ప్రాంతంలో కుట్రలు మొదలు పెట్టారని విమర్శించారు. ఆంధ్రాలో 12 ఏళ్లు గడిచిన రాజధాని నిర్మాణం చేతకాక ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
విగ్రహాలు పార్సిల్ చేస్తాం

తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తుండటంపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా తమ అస్తిత్వంపై దాడియే అన్నారు. తమతో పెట్టుకుంటే గతంలో తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. మరోసారి తమ జోలికి వస్తే ఈసారి పళ్లు రాలగొడతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. తెలంగాణ లో ఏర్పాటు చేస్తున్నఆంధ్రా నాయకుల విగ్రహాలను తమ పార్టీ అధికారంలోకి వచ్చాక పగలకొట్టి మరీ పార్సిల్ చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎంతో సహన శీలురుని… అందుకే ఇప్పటికీ కూడా ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఇక్కడ ఉన్నప్పటికీ గౌరవిస్తున్నామన్నారు. కానీ శృతి మించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కవిత హెచ్చరించారు. తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతున్నట్లుగానే ఆంధ్రాలో తెలంగాణ నాయకుల విగ్రహాలు పెడతారా అని ప్రశ్నించారు. పీవీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సహా తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.
సీఎం ఆంధ్రా ఏజెంట్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రా రాజకీయ నేతల ఏజెంట్ అని కవిత ఆరోపించారు. ఆయన సహకారంతోనే తెలంగాణపై ఆంధ్రా నాయకులు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన మొదట్లో ఈ ప్రాంతం గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారో అప్పటి నుంచి మళ్లీ కుట్రలు మొదలయ్యాయన్నారు. తెలంగాణ మేధావులు ప్రొఫెసర్ నాగేశ్వర్, పాశం యాదగిరి లాంటి వాళ్లు తమ విశ్లేషణలు చేస్తే ఆంధ్రా పోలీసులు ఇక్కడకు వచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పే ధైర్యం చేయటమేమిటనీ ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజలతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని …కానీ ఆంధ్రా రాజకీయ నాయకులతో మాత్రం సమస్య ఉందన్నారు. తెలంగాణ సెక్రటేరియేట్ లో, ఇక్కడి రాజకీయాల్లో వేలు పెడతామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కవిత తేల్చిచెప్పారు.
రాజధాని నిర్మాణం చేతకాలేదు..
ఆంధ్రా నాయకులకు రాజధాని నిర్మాణం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్న రాజధాని నిర్మించటంలో రెండు పార్టీలు ఫెయిలయ్యాయన్నారు. దీన్ని ప్రజలను డైవర్ట్ చేయటానికి మహానాడులో తెలంగాణ వ్యక్తితోనే తెలంగాణ అనే పదం డిక్షనరీ లేదని అనిపించారని విమర్శించారు. యాధృచ్చికంగా కాకుండా పథకం ప్రకారం జరుగుతున్న కుట్రలని కవిత చెప్పారు.
సినిమా యాక్టర్ గా రెండు డైలాగ్ చెప్పుకోని సభ పెట్టుకోవచ్చని అన్నారు. తెలంగాణలో నవ నిర్మాణ్ సంగతి తర్వాత ముందు ఆంధ్రా సెక్రటేరియేట్ నీళ్లు రాకుండా చూసుకోవాలని పవన్ కు సలహా ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన యోగా చేసిన ఒక్క ఓటు కూడా రాదన్నారు.
తెలంగాణ తల్లిపై కన్నేస్తే ఊరుకోం
తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్న పవన్ కళ్యాణ్ కు, తెలంగాణలో విస్తరిస్తామని ప్రకటించిన లోకేష్ కు కలిసి కవిత కౌంటర్ ఇచ్చారు. విస్తరించటానికి లోకేష్ బాబు ఇదేం మీ సామ్రాజ్యం కాదని చెప్పారు. అసలు ఆంధ్రా నాయకులు ఎప్పుడైనా తెలంగాకు మంచి జరగాలని కోరుకున్నారా అని కవిత ప్రశ్నించారు. తెలంగాణను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రా రాజకీయ నాయకులతోనే అసలైన సమస్య అని అన్నారు. ఆంధ్రాలో రైతులను, ప్రజలను దోచుకున్నది చాలక తెలంగాణను కూడా దోచుకుంటారా అని నిలదీశారు. హైదరాబాదులో అధికారికంగా జయశంకర్ సార్ విగ్రహాం కొలువు తీరడం ఒక చారిత్రక అవసరమని అన్నారు.అందుకు అవకాశం ఇవ్వాలని కవిత సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసారు.











Leave a Reply