(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగించుకుని నీటిని ఎత్తిపోడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక పోతే తమకు వారం రోజులు అప్పగిస్తే…నీటిని ఎలా ఎత్తిపోయాలో చూపిస్తామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి పంపహౌస్ ను బీఆర్ ఎస్ నేతలతో కలిసి కేటిఆర్ సందర్శించారు. గోదావరి జలాలు వృదా అవుతున్నా ప్రభుత్వం ఈ నీటి గుకన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం పంప్హౌస్ల నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ నీటిని ఎత్తిపోయకపోతే దాదాపు 50 వేల మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు, మరోవైపు ఎల్నినో ప్రభావం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఇంతటి కరువు పరిస్థితుల్లో కూడా లక్షల క్యూసెక్కుల గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతున్నా, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

రైతుల కోసం ప్రధాన ప్రతిపక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వస్తుంటే తమను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం ప్రజలందరూ చూశారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల సమస్యల కోసం వస్తున్న తమపై ఇంతటి పోలీసు నిర్బంధం ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. “రైతుల కోసం మేము వస్తే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత భయం?” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు. “రాష్ట్రానికి పట్టిన శని రేవంత్రెడ్డి” అని కేటీఆర్ విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని జాతికి అంకితం చేసినా, ఆ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించే స్పృహ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేకపోవడం బాధాకరమన్నారు.
నేతలకు అడ్డంకులు……
కేటిఆర్ కాళేశ్వరం సందర్శన కోసం కేటిఆర్ సహా బీఆర్ ఎస్ నేతలు బయలు దేరిన తరువాత వరంగల్ రహదారిపై అడ్డంకులు సృష్టించారు. ఎన్నో ఆటంకాలను పోలీసులు సృష్టించారని బీఆర్ ఎస్ నేతలు ఆరోపించారు. బీఆర్ ఎస్ నేతలను చాలా చోట్ల ఉదయం నుంచే హౌస్ అరెస్టులు చేశారని కేటిఆర్ ఆరోపించారు.
.
.












Leave a Reply