NewsInn

News in a Click

జూప‌ల్లి సెల్ఫ్ గోల్…దిద్దుబాటు చ‌ర్య‌లపై ఫోక‌స్

జూప‌ల్లి సెల్ఫ్ గోల్…దిద్దుబాటు చ‌ర్య‌లపై ఫోక‌స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మంత్రి జూప‌ల్లి కృష్ణారావ్ గురువారం సెల్ఫ్ గోల్ చేసుకుని శుక్ర‌వారం దిద్దు బాటు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు. రాష్ట్ర ఆర్దిక ప‌రిస్థితి పై మీడియా స‌మావేశాన్ని గాంధీ భ‌వ‌న్ లో నిర్వ‌హించిన జూప‌ల్లి బీఆర్ ఎస్ నేత‌ల‌కు స‌వాల్ విసిరారు. గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు తెలంగాణా భ‌వ‌న్ లో బ‌హిరంగ చ‌ర్చ‌కు వ‌స్తాన‌న్న‌ది మంత్రి స‌వాల్….ఇక కాంగ్రెస్ ను వేటాడే ప‌నిలో ఉన్న బీఆర్ ఎస్ కు ఇదో అస్త్రంగా దొరికింది. అధికార పార్టీలో ఉడి అస్త్రాన్ని అందించిన జూప‌ల్లి వ్య‌వ‌హారాన్ని బీఆర్ ఎస్ అందిపుచ్చుకునే య‌త్నం చేసింది. స‌వాల్ కు సిద్ధంమ‌ని తెలంగాణా భ‌వ‌న్ లో ఏర్పాట్లు చేస్తామ‌ని రావాల‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అంగీక‌రించి మాజీ ఆర్ధిక మంత్రి హ‌రీష్ రావ్ తో క‌లిసి ఉద‌యం 10 గంట‌ల ప్రాంతంలో తెలంగాణా భ‌వ‌న్ కు ఇద్ద‌రు చేరుకున్నారు. ఆలోపే జూప‌ల్లి కృష్ణారావ్ ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మం ఉంద‌ని… గాంధీ భ‌వ‌న్ కు ప‌రిమిత‌మ‌య్యారు.

ఇదో స‌మ‌యంలో సంక్షేమంపై జ‌రుగుతున్న చ‌ర్చ‌లో బీఆర్ఎస్ ఆరోపించిన‌ట్లు 2 వేల కోట్ల రుపాయ‌ల కుంభ‌కోణం జ‌రుగలేద‌ని సంక్షేమశాఖ‌ల మంత్రులు మంత్రులు పొన్నం, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్, అజ‌హారుద్దీన్ లు గ‌న్ పార్క్ ద‌గ్గ‌ర బ‌హిరంగంగా చ‌ర్చించేందుకు బీఆర్ ఎస్ నేత‌లు రావాల‌ని ఎదురు చూస్తున్నారు. ఈ మంత్రుల‌తో చ‌ర్చించేందుకు వ‌స్తున్న స‌మ‌యంలోనే మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హ‌రీష్ ను అదుపులోకి తీసుకున్న త‌రువాత జూప‌ల్లి గ‌న్ పార్క్ కు చేరుకుని బావ, మ‌రిది ఇద్ద‌రు క‌లిసి వ‌స్తే ఇక్క‌డే చ‌ర్చిద్దామ‌ని మ‌రోసారి ప్ర‌క‌ట‌న చేశారు.మంత్రి ప్ర‌క‌ట‌న‌తో సంక్షేమంపై జ‌రుగుతున్న స‌వాల్ ఆర్ధికప‌రిస్థితి కి మారింది.

జూప‌ల్లి తో చ‌ర్చ కోసం ఎదురు చూస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ త‌న‌కు ఎదురుగా మ‌రో కూర్చీ వేసి దానికి జూప‌ల్లికి కేటాయిస్తున్న‌ట్లు పేరు పెట్టి ఉంచారు. ఇక జూప‌ల్లి తెలంగాణా భ‌వ‌న్ కు వెళ్ల‌కుండానే కొత్త ప‌ల్ల‌వి అందుకోవ‌డంతో బీఆర్ ఎస్ మ‌రింత ఘాటుగా జూప‌ల్లిపై ఎదురు దాడి మొద‌లు పెట్టింది. మంత్రి వ్యాఖ్య‌ల‌తో ఒక్క సారిగా వేడెక్కిన రాజ‌కీయంతో కాంగ్రెస్ పార్టీ ఇంటా, బ‌య‌ట విమ‌ర్శ‌లు ఎదుర్కొక తప్ప‌లేదు. ఈ ప‌రిస్థితుల‌ను అధిగ‌మించేందుకు శుక్ర‌వారం మ‌రోసారి జూప‌ల్లి మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి మాజీ సీఎం కేసిఆర్, కేటిఆర్, హ‌రీష్ రావులు చ‌ర్చ‌కు వ‌స్తేనే తాను చ‌ర్చ‌కు రెడీ అని మ‌రోసారి ప్ర‌క‌టించారు. త‌న మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని మీడిమా ముందు హ‌ల్చ‌ల్ మొద‌లు పెట్టారు. అంత‌కు ముందు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌కు కేటిఆర్ లేఖ రాయ‌డంతో ఆ లేఖ‌ను ఆధారంగా చేసుకుని జూప‌ల్లి…. బీఆర్ ఎస్ ను టార్గెట్ చేసే య‌త్నం చేశారు. జూప‌ల్లి వ్యాఖ్య‌ల‌కు వెంట‌నే హ‌రీష్ రావ్ సిద్దిపేట‌లో కౌంట‌ర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేత‌లు చ‌ర్చ‌కు వ‌స్తే సాయంత్రం 5 గంట‌ల‌కు తాను వ‌స్తాన‌ని స‌వాల్ చేశారు.

దీంతో అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న జూప‌ల్లి మ‌రో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, ఎమ్మెల్యే శంక‌ర్ తో క‌లిసి ప్రెస్ క్ల‌బ్ కు చేరుకుని తాను చ‌ర్చించేందుకు వ‌చ్చినా బీఆర్ ఎస్ నేత‌లు రాలేద‌ని త‌న స‌వాల్ కు తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ప్ర‌క‌ట‌న చేశారు.మొత్తం మీద రెండు రోజుల ఎపిసోడ్ లో మొద‌టి రోజు కాంగ్రెస్ డిఫెన్స్ లో ప‌డ్డా…రెండో రోజు దాన్ని పూడ్చుకునే య‌త్నాలు చేసిందన్న చ‌ర్చ జ‌రుగుతోంది.అయితే ఈ వ్య‌వ‌హారంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో వేయ‌డంలో తాము విజ‌య‌వంతం అయిన‌ట్లు బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *