NewsInn

News in a Click

పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

(హైదరాబాద్, న్యూస్ఇన్)

ప్రజా ప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించి రేపటితో 20 ఏళ్లు అయిన సందర్భంగా సీఎం రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన పాలమూరు జిల్లా మిడ్జిల్ లో పర్యటించనున్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటకు సీఎం చేరుకుంటారు.ఊరుకొండలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.మధ్యాహ్నం 1 గంటలకు ఆలయ ఆవరణలో ఆత్మీయులు, ఆనాటి పెద్దలతో లంచ్, మాట ముచ్చట కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.మధ్యాహ్నం 2.30 గంటలకు ఊరుకొండపేట నుంచి రోడ్డు మార్గంలో మిడ్జిల్ కు బయలుదేరుతారు. మిడ్జిల్ లోని వెల్జాల క్రాస్ రోడ్డు వద్ద డా.బీఆర్ అంబేద్కర్, మాజీ ఎమ్మెల్యే ద్యాప గోపాల్ రెడ్డి ( గుడిగానిపల్లి గోపాల్ రెడ్డి) విగ్రహాలను సీఎం ఆవిష్కరిస్తారు.అనంతరం
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *