(హైదరాబాద్,న్యూస్ఇన్)
వచ్చే ఏడాది నాటికి కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు పూర్తి చేస్తామని, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ్మిడి హట్టి నిర్మాణం మొదలు పెడుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికారులతో కలిపి పీపీపీ ఇచ్చిన ఉత్తమ్ ప్రపంచంలో కాళేశ్వరం ప్రాజెక్టు కంటే చెత్త ప్రాజెక్టు మరొకటి లేదన్నారు. గత ప్రభుత్వ విధానం వల్ల తెలంగాణా ప్రజలకు భారంగా మారింది. ఎన్డీఎస్ ఏ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మరమ్మత్తులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్డీ ఎస్ ఏ అధికారుల సూచనల మేరకు అన్ని పరీక్షలు నిర్వహించామని , మరమ్మత్తుల కోసం అంతర్జాతీయ ఏజన్సీలను రంగంలోకి దించామన్నారు. ఎన్డీఎస్ ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డం, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయన్న అనుమానాలు మంత్రి వ్యక్తం చేశారు. నీటిని ఎత్తిపోసినా వాటిని నివల్లవ చేయడం సాధ్యం కాదన్నారు.

మరమ్మత్తుల కోసం అన్ని పరీక్షలను నిర్వహించామని ఆ నివేదికల ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థ సూచనలతో ప్రాజెక్టు మరమ్మత్తులు పూర్తి చేస్తామన్నారు. బీఆర్ ఎస్ నేతలు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. మరమ్మత్తులు నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులు కూడా మీడియా సమావేశంలో ప్రాజెక్టుకు చేస్తున్న పరీక్షలను వివరించారు. ప్రాథమిక పరీక్షలు కూడా లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు.












Leave a Reply