(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు పాటు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలపై సీఎం ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జి లను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ట్రాఫిక్ మళ్లించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.తారామతి బారామతి ని టూరిజం ప్లేస్ గా మరింత గా అభివృద్ధి చేయాలని సూచించారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రదేశంగా తీర్చి దిద్దాలని సూచించారు.

నగరంలోని పురాతన అతిథి గృహాలైన మంజీరా, దిల్ కుషాలను ఆధునీకరించి అందుబాటులోకి తేవాలన్నారు. టూరిజం హబ్ డెవెలప్ మెంట్ పథకం కింద వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. క్యూర్ పరిధి లో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖ తో కలిసి ఎకో టూరిజం గా అభివృద్ధి చేయాలి. హైదరాబాద్ లో డిసెంబర్ లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ పై వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులు మొదలు పెట్టాలని సూచించారు.












Leave a Reply