పోక్సో కేసులో స్టేషన్ బేయిల్ దక్కించుకున్న ఆరు హత్యలు చేసిన రాజ్ కుమార్ తనను అరెస్టు చేయకుండా ఉండేందుకు స్థానిక పోలీసుతో డీల్ కుదుర్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ హత్యల కేసులో పోలీసుల వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నా నేపథ్యంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. కీలకమైన కేసులో పోక్సో కేసు నిందితుడి గురించి పోలీసులు అసలు పట్టించుకోకపోవడం తీవ్ర చర్చనీయంశంగా మారింది. పక్కా ప్రణాళికతో ఆరు హత్యలు చేసిన నిందితుడు….రెండు రోజులుగా పోలీసులకు చిక్కడం లేదు. ఇది కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. రాజ్ కుమార్ తాను చేసిన హత్యల గురించి తెలియచేస్తూ…..ఆత్మహత్య చేసుకుంటున్నానని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో…నిందితుడి సమాచారం అంతా అయోమయంగా మారింది.
సీఐ,ఎస్ ఐ సస్పెండ్……….

ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగుతున్నా….అది పూర్తిగా తప్పని పోలీసు అధికారులు ప్రకటించారు. నిందితుడి గురించి సమాచారం ఇస్తే 2 లక్షల రుపాయాల వివార్డు ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి గ్రామంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పోలీసులు పహారా కాస్తున్నా….రాజ్ కుమార్ ఇంటిపై గ్రామస్తులు దాడి చేసి ఇంటిని తగుల బెట్టాలని ప్రయత్నం చేశారు. కాని పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మరో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ మొత్తం కేసు పోలీసుల నిర్లక్ష్యం చుట్టే తిరుగుతుండడం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. పోలీసు ఉన్నతాధికారులు స్థానిక ఎస్ఐ, సీఐ లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోసారి పోలీసులు తనను అరెస్టు చేయకుండా స్థానిక పోలీసు అధికారులకు రాజ్ కుమార్ భారీగా ముడుపులు చెల్లించారని, దీని కారణంగా పోలీసులు నిందితుడిపై నామమాత్రపు సెక్షన్లతో కేసులు నమోదు చేసినా నిందితుడి హెచ్చరికల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని గ్రామస్తులు అంటున్నారు.
పోలీసుల అంతర్గత విచారణ…..

పోలీసు ఉన్నతాధికారులకు బిగ్ డీల్ వ్యవహారంపై సమాచారం అందడంతో ముందుగా ఎస్ ఐ రమేష్ ను సస్పెండ్ చేసిన అధికారులు ఆ తరువాత సీఐ క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ ప్రచారంపై పోలీసు శాఖ అంతర్గత విచారణను చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడికి ఎవరు సహకరించినా వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ సిద్ధం అవుతోంది.
పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ మారణకాండకు పరిస్థితులు దారి తీశాయని ఆరోపిస్తున్నారు. అయితే నిందితుడి గురించి 8 పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. ఈ సైకో హత్యల కోసం వినియోగించిన కారును పోలీసులు కొత్తూరు సమీపంలో గుర్తించారు. కారు వదిలి సైకో ఇంకా ఏమైనా అఘాయిత్యానికి
పాల్పడ్డాడా అన్న అనుమానాలు వెంటాడుతున్నాయి.












Leave a Reply