(హైదరాబాద్,న్యూస్ఇన్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే షాబాద్ లో ఆరు హత్యలు చేసిన హంతకుడికి సీఎం రేవంత్ రెడ్డి కి పెద్దగా తేడా లేదన్నది నా అభిప్రాయం అని మాజీ మంత్రి హరీష్ రావ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లో పచ్చి అబద్ధాలు, బూతులు, శాడిజం. మూడు లక్షణాలు స్పష్టంగా కనిపించాయి.రైతులు సాగునీరు అడిగితే.. దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను.. ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్టుతో కొట్టాలి అని ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా స్పందించడం అత్యంత జుగుప్సాకరమన్నారు.హిట్లర్ తనకు ఆదర్శం అన్న రేవంత్ రెడ్డి, అదే హిట్లర్ తరహాలో హంతక భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్లను కూడా భయ భ్రాంతలకు గురి చేసే విధంగా సీఎం వ్యాఖ్యలున్నాయన్నారు.ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు సైతం కేవలం రూ. 8.5 కోట్ల ఖర్చుతో ఒక కాఫర్ డ్యామ్ కట్టుకుని నీళ్లు ఎల్లంపల్లికి తీసుకువెళ్లొచ్చని ప్రభుత్వానికి లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 వేల ఎకరాల భూసేకరణ చేసి, 13,296 ఇండ్లు కట్టి పునరావాసం కల్పించిందన్నారు. 2016 తర్వాతనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో (20 టీఎంసీలు) వినియోగంలోకి తెచ్చిందని చెప్పారు.
పట్టింపులకు పోతే పవర్ పోతుంది….
ఈరోజు ఎల్లంపల్లిలో కేవలం 7-8 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ తీసేస్తే 4-5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని హరీష్ రావ్ అన్నారు. ఎన్టీపీసీకి 5, సింగరేణికి 5, హైదరాబాద్ తాగునీటికి 10 టీఎంసీలు అవసరం. సీఎం పంతాలకు పోయి నీళ్లు ఎత్తకపోతే రేపు కరెంట్ ఉత్పత్తి ఆగిపోయి రాష్ట్రం అంధకారం అవుతుందన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం రాకముందు వరి సాగు 34 లక్షల ఎకరాల నుంచి కోటి 18 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.

భ్రదాచలం మునగదు…
అన్నారంలో 5 టీఎంసీలు, సుందిల్లలో 3.8 టీఎంసీలు మొత్తం 8.8 టీఎంసీలు నిలిపితే.. ఒకవేళ రెండు బ్యారేజీలకు ఒకేసారి ఇబ్బంది వచ్చినా కిందికి వెళ్లేది కేవలం 1.10 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే. 2022లో ఏకంగా 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే భద్రాచలంకు ఎలాంటి ముప్పులేదని హరీష్ రావ్ చెప్పారు.ఎక్స్ పర్ట్స్ ను, ఆర్మీ ఇంజనీర్లను తెచ్చామని గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డికి ఏ సీజన్ లో పనులు చేయాలో తెలియదు. మీరు ఆర్మీ ఇంజనీర్లను తెచ్చి ఇంత పడగొట్టింది ఏంటి అని ప్రశ్నించారు.
పట్టి సీమకు మేలు చేస్తున్నసీఎం….
తెలంగాణాలో నీళు ఎత్తిపోయకుండా వదిలి పెడుతూ చంద్రబాబుకు గురుదక్షిణ సీఎం రేవంత్ చెల్లించుకుంటున్నారని ఆరోపించారు. తద్వారా పట్టి సీమకు మేలు చేస్తున్నారని అన్నారు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన రేవంత్ కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 12% కమీషన్లు, రెవెన్యూలో 30% కమీషన్లతో ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. పంతాలకు పోయి రైతుల పంటలను ఎండబెట్టకండి. తక్షణమే కన్నెపల్లి, దేవాదుల మోటార్లు పూర్తిస్థాయిలో ఆన్ చేసి రాష్ట్రాన్ని కరువు బారి నుంచి కాపాడండి. క్రెడిట్ అంతా మీరే తీసుకోండని హరీష్ రావు సూచించారు.












Leave a Reply