(హైదరాబాద్,న్యూస్ఇన్)
మరో నాలుగు రోజుల్లో తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాలపై హై కమాండ్ కు నివేదిక ఇవ్వనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఈ అంశంపై చర్చించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంలో తాను జోక్యం చేసుకోనని మంత్రి తనకు తెలియచేశారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలపై చర్చకు వచ్చాయన్నారు. తుంగతుర్తిలో మూడు నాలుగు,మండలాల్లో ఏఐసీసీ నిబంధనలు ప్రకారం నియామకాలు జరుగలేదని తన సమీక్షల్లో తేలిసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే టికెట్ల కేటాయింపు జరుగుతుందని, ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకపోతే ఎవరినైనా పక్కన పెట్టే అవకాశం ఉందన్నారు. నాకు కూడా ఈ పరిస్థితి ఎదురు కావచ్చని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
ఎల్బీ నగర్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి…..
ఇటీవల వివాదాస్పదంగా మారిన ఎల్బీనగర్ కాంగ్రెస్ వ్యవహారంపైనా జగ్గారెడ్డి స్పందించారు. ఈశ్వరమ్మ,
శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అంతా మాపార్టీ నేతలే…. ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యంగా యాదవులకు గుర్తింపు ఇస్తోందని, యాదవ నేతలు పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. శివచరణ్ రెడ్డి కుటుంబం కూడా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తోందని ఫోన్ లో మాట్లాడిన మాటలు రికార్డు చేసి బయట పెట్టడం భావ్యం కాదన్నారు. పార్టీ నేతల మధ్య పంచాయతీలో బయటి వాళ్లు తల దూరుస్తున్నారని ఈ పరిస్థితులను గమనించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.












Leave a Reply