(న్యూఢిల్లీ, ,న్యూస్ఇన్)
ఎల్ నినో ప్రభావంతో దేశంలోని మెజార్టీ ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. వర్షపు నీటిని సంరక్షించడం, భూగర్భ జలాలను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘క్యాచ్ ది రైన్–2026’ జాతీయ ప్రజా ఉద్యమాన్ని చేపట్టింది. జూలై 4 నుంచి ఆగస్టు 4, 2026 వరకు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. “ప్రతి వానచుక్కను కాపాడుకుందాం – ప్రతి రేపటిని భద్రపరుచుకుందాం” అనే సందేశంతో ప్రజలను భాగస్వామ్యాన్ని చేయాలని నిర్ణయం తీసుకుంది.
వర్షపు నీటి సంరక్షణ (రెయిన్వాటర్ హార్వెస్టింగ్) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. అలాగే రీచార్జ్ పిట్స్, రీచార్జ్ షాఫ్ట్లు ఏర్పాటు చేయడం, ఉపయోగంలో లేని బోర్వెల్లను భూగర్భ జలాల రీఛార్జ్కు వినియోగించుకోవాలని సూచించింది.

ఇళ్లు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అన్నీ వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని సూచించింది పురాతన బావులు, బావిళ్లు, చెరువులు, కుంటలు వంటి జల వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, స్థానిక సంస్థలతో యువత, విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు క్రియాశీల పాత్ర ను పోషించాలని పిలుపునిచ్చింది.వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు వర్షపు నీటిని ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.














Leave a Reply