(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాగితపు కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధం అవుతోంది. ప్రయోగాత్మకంగా ₹10, ₹20 విలువల ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్లాస్టిక్ నోట్లు ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీకి ప్రత్యామ్నాయం కాదని, కాగితపు నోట్లతో పాటు ఇవి కూడా చలామణిలో ఉంటాయని ప్రభుత్వం సోమవారం లోక్సభలో స్పష్టం చేసింది.
జూలై 17న ఆర్బీఐకి చెందిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు అవసరమైన పాలిమర్ సబ్స్ట్రేట్ తయారీ, సరఫరా కోసం అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EoI) ఆహ్వానించినట్లు వెల్లడించింది.రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం ఈ పాలిమర్ నోట్ల ప్రభావాన్ని డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై అధ్యయనం చేస్తోంది. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే, ₹10 మరియు ₹20 నోట్లలో ఒక్కో విలువకు సుమారు 100 కోట్ల (1 బిలియన్) నోట్లు ముద్రించే ప్రణాళిక ఉంది. ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరిస్తున్న పాలిమర్ కరెన్సీ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ప్రాథమిక నిర్ణయం మాత్రమే అని, ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది.















Leave a Reply