రూ.500 కట్టబోయి 6 లక్షలు కోల్పోయిన బాధితుడు
(హైదరాబాద్, న్యూస్ఇన్)
సైబర్ నేరగాళ్లు ఏ అవకాశం వచ్చినా తమకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేస్తారు. ప్రజల్లో అనుమానాలు, అపోహలను సృష్టించి బ్యాంకు అకౌంట్ల నుంచి కొంత మంది క్రెడిట్ కార్డుల నుంచి మరికొంత నేరగాళ్లు తమ టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నగరంలో సైబర్ నేరగాళ్లు ఇ చలాన్లపై దృష్టి పెట్టారు. వాహనాల పై అరుదుగా ట్రాఫిక్ పోలీసులు వేసే ఫైన్లు నగరంలోని చాలా వాహనదారులకు పెండింగ్ లో ఉంటాయి. దీన్ని పరిగణలోకి తీసుకుని సైబర్ నేరగాళ్లు ఇ చలాన్ పేరుతో SMS లు పంపుతూ క్లియర్ చేయాలని కోరుతున్నారు. ఈ మెసెజ్ నిజమని భావించిన కొంత మంది మెసెజ్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి పెండింగ్ చాలన్లు క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

చాలన్ క్లియరెన్స్ మాట ఎలా ఉన్నా…..బ్యాంకు అకౌంట్ మాత్రం ఖాళీ అవుతోంది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తం ఇలాంటి లింక్ తో సుమారు ₹6 లక్షలు నష్టపోయారు.ఈ లింక్ లో ట్రాఫిక్ చాలన్ చెల్లించే వెబ్ సైట్ మాదిరిగానే నకిలీ వెబ్ సైట్ కూడా సైబర్ నేరగాళ్ళు సృష్టించారని పోలీసులు గుర్తించారు. ఇ చాలన్ లో పెండింగ్ లో ఉన్న రు.500 జరిమానా చెల్లించడానికి ప్రయత్నించాడు, కానీ కొన్ని క్షణాల తర్వాత, మోసగాళ్లు అనధికార అంతర్జాతీయ లావాదేవీల ద్వారా అతని క్రెడిట్ కార్డ్ నుండి €6,900 (సుమారు ₹6 లక్షలు) వసూలు చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది.
పోలీసుల సూచనలు……
SMSలో వచ్చిన లింకుల ద్వారా జరిమానాలు ఎప్పుడూ చెల్లించవద్దు.
అధికారిక echallan.parivahan.gov.in వెబ్సైట్ను లేదా రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్ను సందర్శించండి.
సైబర్ మోసానికి గురయ్యారా ? వెంటనే 1930కు డయల్ చేయండి.





Leave a Reply