(న్యూస్ఇన్, హైదరాబాద్)
మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఎంపీ వేం నరేందర్ రెడ్డికి రాజకీయ సంకటంగా మారింది. ఈ వ్యవహారంలో కొండా సురేఖపై వత్తిడి రాజకీయంగా వత్తిడి పెంచేలా చక్రం తిప్పాలని సీఎం పట్టు దలతో ఉండడంతో సీఎం కు అత్యంత సన్నిహితంగా ఉండే వేం నరేందర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.ఏక పక్ష నిర్ణయాలకు వెళ్లకుండా పార్టీ అంతర్గతంగా ఉన్న పరిస్థితులను ముందుగా తెరపైకి తెచ్చి ఆ తరువాత కొండా సురేఖపై నిర్ణయానికి రావాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా పర్యటన అనంతరం ఈ వ్యవహారం రాజుకోవడం…సీఎం విదేశీ పర్యటనలో ఉండడంతో విదేశీ పర్యటన ముగించుకుని వచ్చే లోపు కొండాపై పార్టీ నేతలతో అటాక్ మొదలు పెట్టేందుకు అనుగుణంగా వేం చక్రం తిప్పారు. అందులో భాగంగా కొండా సురేఖపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గళం విప్పారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ వినిపించారు. దాదాపు 20 మంది నేతలు బేటీపై కావడం కాంగ్రెస్ లో హాట్ హాట్ గా మారింది. భేటీ అయిన నేతల్లో వరంగల్ జిల్లాకు చెందిన నేతలతో పాటు ఇతర నేతలు కూడా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో బసవరాజు సారయ్య మినహా ఇతర నేతలు ఈ భేటీకి హాజరు కాలేదు.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన మెజార్టీ నేతలే శాసనసభా పక్ష కార్యాలయంలో జరిగిన భేటీకి హాజరై కొండా కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అయితే వేం నరేందర్ రెడ్డి ఈ వ్యవహారాన్ని ఆచి తూచి ముందుకు తీసుకెళ్లాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. తమ వర్గం నేతలను తెరపైకి తెచ్చినా…కొండా సురేఖకు మద్దతు ఇస్తున్న నేతలు ఎవరన్న దానిపై కూడా పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణా కాంగ్రెస్ నేతల మద్దతుతోనే కొండా కుటుంబం ముఖ్యమంత్రిపై అటాక్ చేస్తుందా….పార్టీ హై కమాండ్ లో ఎవరైనా పెద్దల హస్తం ఉందా అనుమానాలు కూడా రేవంత్ రెడ్డి వర్గం నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన ఆరోపణలతో రాజకీయంగా అధికార పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు కొండా సురేఖ ఇంటికి వెళ్లి మాజీ ఓ ఎస్డీ సుమంత్ ను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేయడం హాట్ హాట్ గా మారింది. సుమంత్ పై తాజాగా కూడా ఓ కేసు నమోదు కావడం విశేషం. మొత్తం మీద కొండా వర్సెస్ తెలంగాణా కాంగ్రెస్ అనే విధంగా సీన్ మారుతుందా అన్న చందంగా మారుతోంది. ఇదే అదనుగా కొండాను రాజకీయంగా పిండి చేయాలన్న లక్ష్యంగా కొండా సురేఖ వ్యతిరేక వర్గం పార్టీలో పావులు కదుపుతోంది. అయితే ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉండడంతో పార్టీ హై కమాండ్ ఎలాంటి సూచనలు చేస్తుందా అన్నది కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.












Leave a Reply