(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ లో రేసు గుర్రాలకు డ్రగ్స్ ఇస్తూ పట్టుబడడం కలకలం రేపుతోంది. మానవాళికి ముప్పుగా మారిన ఈ డ్రగ్స్ ఇప్పుడు మూగ జీవాలకు విస్తరిస్తున్నాయి. పాల ఉత్త్పత్తిని పెంచేందుకు మాత్రమే ఇప్పటి వరకు మూగ జీవాలకు డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణలు చాలా రోజులుగా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ రేస్ క్లబ్ లో ఓ గుర్రాలకు డ్రగ్ ఇంజక్షన్ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. నార్తర్న్ స్కై గుర్రానికి రేసు ప్రారంభానికి ముందు నిషేధిత డ్రగ్స్ ఇచ్చినట్లు అనుమానాలు వచ్చాయి. దీంతో సీసీటీవి పుటేజీలను పరిశీలిస్తే గుర్రానికి డ్రగ్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. ట్రైనర్ శిశికాంత్ సహా సహాయక సిబ్బందిపై పోలీసులు నమోదు చేశారు. వీరితో పాటుముకేష్ పాస్వాన్, రవీందర్ సింగ్, లోకేష్ అనే వ్యక్తులపైనా కేసు నమోదైంది.రేస్ ప్రారంభానికి ముందుగానే గుర్రం అసాధారణంగా ప్రవర్తించడంతో రేస్ కోర్స్ నిర్వహాకులకు అనుమానం కలిగింది.

దీంతో ఆ గుర్రానికి వైద్య పరీక్షలను నిర్వహింప చేశారు. వెటర్నరీ వైద్యులు పరీక్షించి రేస్ లో పాల్గొనకుండా బ్రేకులు వేశారు. గుర్రానికి డ్రగ్ ఇవ్వడంతో సిబ్బందిపై చీటింగ్, జంతువుపై క్రూరంగా వ్యవహరించారన్న ఆరోపణల కింద కేసు నమోదు చేశారు.రేసింగ్ రికార్డుల ప్రకారం “Northern Sky” మూడు సంవత్సరాల వయసున్న గుర్రం. 2026లో హైదరాబాద్లో జరిగిన రేసుల్లో కూడా ఈ గుర్రం పాల్గొంది.ప్రస్తుతం నిషేధిత పదార్థం ఏమిటి? దాన్ని గుర్రానికి ఎవరు ఇచ్చారు? దాని వెనుక ఉద్దేశం ఏమిటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.













Leave a Reply