NewsInn

News in a Click

కోడంగల్‌లో రాజకీయ వేడి.. సీఎం పర్యటన వేళ మాజీ ఎమ్మెల్యే నిరసన

కోడంగల్‌లో రాజకీయ వేడి.. సీఎం పర్యటన వేళ మాజీ ఎమ్మెల్యే నిరసన

(న్యూస్ఇన్‌, పాల‌మూరు)

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో అభివృద్ధి పనుల పరిశీలనకు పర్యటిస్తున్న వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకవైపు సీఎం నియోజకవర్గంలో పలు అభివృద్ధి, పనుల పురోగతిని సమీక్షిస్తుండగా.. మరోవైపు బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టేందుకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రేవంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా కోడంగల్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల్లో నాణ్యత, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టుల పూర్తిపై అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాల‌న విఫ‌ల‌మైంద‌ని నిర‌స‌న‌లు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ పిలుపులో భాగంగా మాజీ ఎమ్మెల్యే న‌రేంద‌ర్ రెడ్డి కోడంగ‌ల్ కు రావ‌డంతో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. ముఖ్య‌మంత్రి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డంతో న‌రేంద‌ర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త‌గా అన్ని జిల్లాల్లో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ తీరుపై నిర‌స‌న‌లు తెలుపుతోంది. పోలీసులు బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డ‌తో ఉద్రిక్త‌త నెల‌కొంది.

కోడంగల్ లో అభివృద్ధి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిన సమయంలోనే ప్రతిపక్షం నిరసనకు దిగడం స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరు కూడా కోడంగల్‌ లో మరింత ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *