NewsInn

News in a Click

కాంగ్రెస్ లో పంథం నెగ్గించుకున్న సీఎం రేవంత్ రెడ్డి….!

కాంగ్రెస్ లో పంథం నెగ్గించుకున్న సీఎం రేవంత్ రెడ్డి….!

(న్యూస్ఇన్, హైద‌రాబాద్)

కాంగ్రెస్ హై క‌మాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి పంథం నెగ్గించుకున్నారు. పార్టీలో గ్రూపు త‌గాదాల‌తో క్యాబినెట్లో వివాదాస్ప‌ద మంత్రిగా గుర్తింపు పొందిన కొండా సురేఖ ను రేవంత్ రెడ్డి పంథం నెగ్గించుకున్నారు. కొండాను క్యాబినెట్ లోకి తీసుకున్న త‌రువాత అటు పార్టీ ప‌రంగా ఇటు ప్ర‌భుత్వ ప‌రంగా కొండా వైఖ‌రితో కాంగ్రెస్ డిఫెన్స్ లోకి వెళ్లాల్సి వ‌చ్చింది. ఇటీవ‌ల సీఎం జిల్లాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప‌ర‌కాల‌లో రేవంత్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా కొండా కుటుంబానికి న‌చ్చ‌లేదు. ఎన్నో ఏళ్లుగా ప‌ర‌కాల‌లో పాగా వేయాల‌ని భావిస్తున్న కొండాకు మ‌రోసారి రేవూరి ప్ర‌కాశ్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌ని సీఎం కోర‌డం తాజా వివాదానికి ఆజ్యం పోసిన‌ట్ల‌యింది.

ఈ వ్య‌వ‌హారంలో కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీలో క‌ల‌కం రేపాయి. ముంత్రి పొంగులేటి, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ స‌ష్మిత చేసిన విమ‌ర్శ‌ల‌తో సీఎం కూడా సీరియ‌స్ గా ప‌రిగ‌ణించారు. ఇదే అవ‌కాశంగా మ‌లుచుకుని రేవంత్ రెడ్డి పావులు క‌దిపారు. కొండాపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే అన్న గ‌ళాన్ని కాంగ్రెస్ హై క‌మాండ్ వ‌ర‌కు తీసుకెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు హ‌స్తిన వెళ్లి సీఎం అధిష్టానంతో చ‌ర్చ‌లు జ‌రిపారు. మంత్రి వ‌ర్గంలోకి చేరిన నాటి నుంచి కొండా సురేఖ‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌తో పాటు ఆ శాఖ‌లో చోటు చేసుకుంటున్న అన్ని ప‌రిణామాల‌ను సీఎం హై క‌మాండ్ కు వివ‌రించారు. తాజా వ్యాఖ్య‌ల‌తో పాటు కొండా సురేఖ‌ను పార్టీ హై క‌మాండ్ ఢిల్లీకి ర‌ప్పించి అరా తీసింది.

పార్టీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌ల అనంత‌రం కొండా సురేఖ‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాకు సురేఖ వ‌చ్చిన‌ట్లు తేలిపోయింది. హై క‌మాండ్ తో చ‌ర్చించిన అనంత‌రం సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయ‌డంతో పాటు…. పార్టీ పెద్ద‌ల‌ను బ్లాక్ మేయిల్ చేసే విధంగా వ్యాఖ్య‌లు చేశారు. 10 ఏళ్లు తానే ముఖ్య‌మంత్రి అని సీఎం ఎలా చెబుతార‌ని ప్ర‌శ్నించ‌డంతో పాటు త‌న‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేస్తే సైలెంట్ గా ఉండేది లేద‌ని తేల్చి చెప్పారు. బీసీ సంఘాల‌ను ఏకం చేసి కొత్త ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాన‌న్న సంకేతాలు ఇచ్చారు. సీఎం ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ కు చేరుకోక ముందే ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి కొండా సురేఖ‌ను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కొండాతో పాటు మ‌రో సీనియ‌ర్ నేత చిన్నా రెడ్డి ని ప‌ద‌వి నుంచి త‌ప్పించి ఆ స్థానంలో వెంట‌నే హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య ల‌క్ష్మికి అవ‌కాశం క‌ల్పిస్తూ నిర్ణ‌యం వెలువ‌డింది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీలో ఆస‌క్తి క‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ పెద్లల స‌మ‌క్షంలో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో కూడా ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు కొండా సురేఖ‌కు మద్ద‌తుగా త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. అయితే సీఎం మాత్రం క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే అంటూ ప‌ట్టు బ‌ట్ట‌డంతో రేవంత్ రెడ్డి అభిప్రాయానికి అనుగుణంగా పార్టీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పార్ట వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే కొండా సురేఖ ఎమ్మెల్యేగా కొన‌సాగుతారా లేదా రాజీనామా చేస్తారా అన్న దానిపై జోరుగా చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన అనంత‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మాస్ లీడ‌ర్ గా ఫాలోయింగ్ ఉన్న కొండా కుటుంబం భ‌విష్య‌త్ నిర్ణ‌యాలు ఎలా ఉంటాయ‌న్న‌ది ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *