జవని 7వ తేదీనుంచి అండర్-19 క్రికెట్
వీ.హనుమంతరావ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
వచ్చే నెల 7వ తేదీ నుంచి అండర్ -19 రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ వి హనుమంతరావు ప్రకటించారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం గత 18 సంవత్సరాల నుండి క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాదులో అండర్ -19 చండీగఢ్ లో అండర్ -17 చెన్నైలో అండర్ -15 క్రికెట్ ఛాంపియన్షిప్ ను నిర్వహిస్తున్నానని తెలిపారు.

ఈ టోర్నమెంట్లో 4 దేశాలు 10 రాష్ట్రాలు పాల్గొంటున్నయని తెలిపారు ఎల్బీ స్టేడియం, అత్తాపూర్ లోని విజయానంద్ గౌడ్, అంబర్పేట్ వాటర్ వర్క్స్ గ్రౌండ్ లో క్రికెట్ ఛాంపియన్షిప్ జనవరి 7 తారీఖు తేదీ నుండి 10 వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఫైనల్స్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరై ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు బహుమతులని ప్రధానం చేస్తారని తెలిపారు ఈ టోర్నీలో శ్రీలంక,దుబాయ్, మలేషియా, నేపాల్, తమిళనాడు, మహారాష్ట్ర, చెన్నై,బీహార్,విదర్భ, కర్ణాటక, బెంగళూర్, తెలంగాణ,క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,మరియు హైదరాబాద్,జట్లు పాల్గొంటాయని చైర్మన్ హనుమంతరావు తెలిపారు.




Leave a Reply