(న్యూస్ఇన్,హైదరాబాద్)
తెలంగాణ – ఆగా ఖాన్ అభివృద్ధి సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్తో భేటీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఇస్మాయిలీ ముస్లింల 50వ వారసత్వ ఇమామ్, ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ లోక్భవన్ కు వచ్చారు.
ఇమామ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలంగాణకు ఆయన చేసినలో ఆయన తొలి సారి పర్యటించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. హైదరాబాద్, తెలంగాణకు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దివంగత ఆగా ఖాన్ IV సేవలను స్మరించుకున్నారు . భారతదేశ అభివృద్ధికి, ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సమాజ సంక్షేమానికి దివంగత ఆగా ఖాన్ IV అందించిన సేవలను గవర్నర్ కొనియాడారు. 2015లో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం లభించిందని, దేశ ప్రజలు ఆయనను ఎంతో గౌరవంగా స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్కు ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్తో ఉన్న చిరకాల అనుబంధాన్ని గవర్నర్ ప్రస్తావించారు. 2024 జూలైలో పునరుద్ధరించిన కుతుబ్షాహీ సముదాయాన్ని ప్రారంభించేందుకు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ హైదరాబాద్కు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, పరిసరాల అభివృద్ధిలో ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
తెలంగాణలో ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చేపడుతున్న బహుముఖ అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ ప్రశంసించారు. విద్య, పట్టణ పునరుద్ధరణ, సామాజిక ఆరోగ్య సేవలు, మహిళా సాధికారత, ఉపాధి కల్పన తదితర రంగాల్లో సంస్థ చేస్తున్న కృషి స్థానిక సమాజాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలోని ఆగా ఖాన్ అకాడమీ ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలతో భవిష్యత్ తరాల నాయకులను తీర్చిదిద్దుతున్న సంస్థగా నిలుస్తోందన్నారు.
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ V లోక్భవన్ సందర్శకుల రిజిస్టర్లో తన అభిప్రాయాలను నమోదు చేశారు. తనకు అందించిన ఆత్మీయ స్వాగతానికి, చిరకాల స్నేహం, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.













Leave a Reply