(న్యూస్ఇన్,హైదరాబాద్)
మాజీ మంత్రి హరీష్ రావ్ క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, విప్ అద్దంకి దయాకర్ లపై పరువు నష్టం కేసు వేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మాజీ మంత్రి తరపు న్యాయ వాదులో కోర్టులో కేసు దాఖలు చేశారు. BNS 2023 చట్టం సెక్షన్ 356 కింద కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కొల్లూరు మూకాంబికా దేవి ఆలయ దర్శనాన్ని వక్రీకరించి క్షుద్ర పూజల ఆరోపణలు చేసినందుకే కోర్టులో కేసు వేసినట్లు న్యాయ వాదులు వెల్లడించారు.కాంగ్రెస్ నేతల అసత్య ప్రచారాలకు సంబంధించిన వీడియోలు, పేపర్ క్లిప్పింగ్స్ కోర్టుకు న్యాయ వాదులు సమర్పించారు.
ఆరు గ్యారెంటీల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నాపై క్షుద్ర ఆరోపణలను కాంగ్రెస్ నేతలు చేశారని హరీష్ రావ్ ఆరోపించారు. లీగల్ నోటీసులు పంపినా కాంగ్రెస్ నేతలు తప్పును సరిదిద్దుకునే యత్నం చేయలేదని, చట్టం ద్వారానే వారికి బుద్ధి చెప్పాలన్న అభిప్రాయంతోనే కేసు వేసినట్లు తెలిపారు. లీగల్ నోటీసును పీసీసీ చీఫ్ తిరస్కరించారని, అద్దంకి దయాకర్ పొంతన లేని సమాధానాలు ఇచ్చారన్నారు. అడ్డగోలు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హరీష్ రావ్ హెచ్చరించారు.












Leave a Reply