NewsInn

News in a Click

అసెంబ్లీలో కేసిఆర్ ను క‌లిసిన రేవంత్

అసెంబ్లీలో కేసిఆర్ ను క‌లిసిన రేవంత్

కేసిఆర్ ను క‌లిసేందుకు నేత‌ల ఆసక్తి

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

తెలంగాణా అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా మాజీ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. అసెంబ్లీ 10.30 గంట‌ల‌కు మొద‌లు కానుండ‌గా అంత‌కు ముందుగానే మాజీ సీఎం త‌న సీట్లో వ‌చ్చి కూర్చుకున్నారు. దీంతో అసెంబ్లీ హాల్ లోకి వ‌చ్చిన నేత‌లు మాజీ సీఏం ను క‌లిసేందుకు ఆస‌క్తి చూపారు. అసెంబ్లీ హాల్ లోకి రావ‌డంతోనే సీఎం రేవంత్ రెడ్డి మ‌ర్యాద పూర్వ‌కంగా మాజీ సీఎం కేసిఆర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి క‌ర‌చాల‌నం చేశారు. అంత‌కు ముందు అసెంబ్లీ హాల్ లోకి వ‌చ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసిఆర్ క‌లిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో నూత‌నంగా ఎన్నికైన న‌వీన్ యాద‌వ్ కేసిఆర్ ను క‌లిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీ స‌మావేశాలు కావ‌డం, బీఆర్ ఎస్ పార్టీ కృష్ణా జ‌లాల వివాదాన్ని తెర‌పైకి తేవ‌డంతో ఆసెంబ్లీ స‌మవేశాలు రాజ‌కీయంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. తొలి రోజు సంతాప తీర్మానాల‌తో పాటు ఆర్డినెన్స్ ల‌ను మాత్ర‌మే స‌భ‌లో ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టింది . అసెంబ్లీ ని 15 రోజులు నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాన ప్రతిప‌క్ష‌మైన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీఏసీ స‌మావేశం అసెంబ్లీ స‌మావేశాల తుది నిర్ణ‌యం తీసుకోనింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *