ఇళ్ల ముందు బోర్డు లు పెట్టిన ఓటర్లు
మా ఓటు గ్రామాభివృద్ధి కే
ఆదర్శంగా నిలుస్తున్న జలాలపూర్
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. గెలిచేందుకు రంగంలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఓటర్లు కూడా ఇదే అవకాశంగా నేతలతో లబ్ధి పొందే ప్రయత్నాలు కొంతమంది చేస్తుంటారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు… నిజాయితీకి అభివృద్ధికి ఓటు వేస్తామని ఓ గ్రామస్తులు నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ హాట్ గా మారింది. గ్రామస్తుల చైతన్యానికి ఆ జిల్లా కలెక్టర్ చేస్తున్న ప్రయత్నం తోడైంది… ఇక ఇళ్ళ ముందు అభ్యర్థులకు షాక్ ఇచ్చేలా బోర్డులు వెలిసాయి. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం జమాలాపూర్ ఓటర్లు తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా లో ఓటు హక్కు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ హనుమంత రావు చేపట్టిన ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమంతో గ్రామాల్లో మార్పు కనిపిస్తుంది. గ్రామస్తులు స్వచ్ఛందంగా తమ ఇళ్ల ముందు ఓటు ను అమ్ముకోమని నిజాయితీకి, అభివృద్ధికి ఓటు వేస్తామని రాసి పెడుతున్నారు.మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే 6 మండలాల్లో శుక్రవారం ఉదయం ఓటు హక్కు పై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా బొమ్మల రామారం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఓటు హక్కు పై మహిళలకు విసృత స్థాయి అవగాహన కల్పించారు. మహిళా ఓటరుల అందరితో ఓటు ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలి అని మద్యానికి కానీ డబ్బుకు కానీ మా ఓటు ని అమ్ముకోము అని స్వచంధగా మా ఓటు ని గ్రామాభివృద్ది చేసే నాయకులను ఎన్నుకోవడం కోసం ఉపయోగించుకుంటాం అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

అవగాహన పొందిన మహిళలు ఈరోజు బొమ్మల రామారం మండలంలోని జలాలపూర్ గ్రామనికి చెందిన కొందరు ఓటర్లు తమ ఇండ్ల ముందు స్వచంధంగా మాకు డబ్బులు , గిఫ్ట్ లకు మా ఓటు ని అమ్ముకోము, నీతి నిజాయితీ తో స్వచ్ఛందంగా మా ఓటు వేస్తాం అని బోర్డులు లు ఏర్పాటు చేశారు.





Leave a Reply