NewsInn

News in a Click

ల‌క్ష మందికి పైగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సంద‌ర్శ‌న‌

ల‌క్ష మందికి పైగా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సంద‌ర్శ‌న‌

భారీగా త‌ర‌లి వ‌చ్చిన యువ‌త‌

పది రోజుల పాటు సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌)

బొల్లారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ను ఈ సారి రికార్డు స్థాయిలో సంద‌ర్శ‌కులు సంద‌ర్శించారు. రాష్ట్ర ప‌తి విడిది అనంర‌తం ప్ర‌తి ఏటా సంద‌ర్శ‌కుల కోసం కొన్ని రోజుల పాటు ప్ర‌జ‌లను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సంద‌ర్శించ‌డం అన‌వాయితీగా వ‌స్తోంది. ఈ స‌మ‌యంలో రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌లు కూడా ఏర్పాట్లు చేస్తాయి. ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయ‌, ఉద్యాన వ‌న శాఖ‌లు కీల‌క పాత్ర పోషిస్తాయి. ఈ సారి కూడా రాష్ట్రప‌లి ద్రౌప‌ది ముర్ము శీతాకాల విడిది అనంత‌రం సంద‌ర్శ‌కులకోసం ఏర్పాట్లు చేశారు. దీనికి ఉద్యాన వ‌నశాక ఉద్యాన్ ఉత్స‌వ్ పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో భారతీయ చరిత్ర, సంస్కృతి యొక్క చ‌రిత్ర‌ను చాటిచెప్పే విధంగా వ్య‌వ‌హ‌రించారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ సంద‌ర్శ‌న‌లో భాగంగా పిల్లలు ఈ ప్రదర్శనను పూర్తిగా ఆస్వాదించారని, రైతులు వర్క్‌షాప్‌లలో చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్రపతి సచివాలయం డైరెక్టర్ శివేంద్ర‌ చతుర్వేది ఈ సంద‌ర్శ‌న‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు.

రాష్ట్రపతి నిలయంలోని రాష్ట్రపతి సచివాలయం మేనేజర్ డాక్టర్ కె. రజని ప్రియ మాట్లాడుతూ, ఉత్సవ్ దాదాపు లక్ష మందికి పైగా సందర్శకులను ఆకర్షించిందని చెప్పారు. రాష్ట్రపతి నిలయం వారసత్వాన్ని ఏకం చేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన చొరవ అని ఆమె అన్నారు.

వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ జస్బీర్ సింగ్, త‌మ శాఖ‌కు అవ‌కాశం ఇచ్చి. వ్యవసాయంపై దృష్టి పెట్టడం, FPOల భాగస్వామ్యంలో ప్రాధాన్యత క‌ల్పించ‌డం, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చే అవ‌కాశం ద‌క్క‌డం వ‌ల్ల ఈ కార్యక్రమం తనకు ప్రత్యేక ప్రాముఖ్యతగా భావిస్తున్నాని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వ భాష మరియు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ అనుగు నరసింహ రెడ్డి ఈ ప్రదర్శనను పండుగ లాంటి వేడుకగా అభివర్ణించారు. జానపద పాటలు, నృత్యాలు మరియు నాటకాలు వంటి రోజువారీ సాంస్కృతిక కార్యక్రమాలను గుర్తు చేస్తూ ఇలాంటి కార్య‌క్రమాలు యువ‌త‌కు భాషా, సాహిత్యం, సాంస్కృతిక అంశాలపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు దోహ‌ప‌డుతాయ‌న్నారు.

MANAGE డైరెక్టర్ డాక్టర్ శాలేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం ఆధునిక వ్యవసాయ ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించిందని, విద్య మరియు ఉపాధి అవకాశాల కోసం కెరీర్ కౌన్సెలింగ్ అందించిం వ్య‌వ‌సాయ ఉత్పత్తులను ప్రోత్సహించిందన్నారు. ఈ ఉత్సవంలో 50 కంటే స్టాళ్లను ఏర్పాటు చేశారు.ఈ స్టాళ్ల ద్వారా కొత్త అవ‌కాశాలు యువ‌త తెలుసుకునేందుకు అవ‌కాశం ద‌క్కింద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *