(అమరావతి, న్యూస్ఇన్)
డేటా డ్రివెన్ గవర్నెన్సుతో రియల్ టైమ్ రిజల్ట్స్ సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. డేటా డ్రివెన్ గవర్నెన్సు ఆధారంగా పాలనను మరింత సులభతరం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. దీని కోసం దేశంలోనే మొదటిసారిగా మంత్లీ ఎకనామిక్ రిపోర్టుల ద్వారా వృద్ధిని సమీక్షించుకుంటున్నామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ నెలా… నెలవారీ ఆర్ధిక నివేదికలను విడుదల చేస్తామని దానికి అనుగుణంగా రాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వ శాఖలు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ఎంఈఆర్పై నిర్వహించిన సమావేశంలో సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెలవారీ ఆర్ధిక నివేదికల ద్వారా ఎప్పటికప్పుడు రెవెన్యూ రాబడులను అంచనా వేసేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. అధికారులు, ఉద్యోగుల నెలవారీ పనితీరును, నైపుణ్యాలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు వెళ్తామన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”2019-2024 మధ్య అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కోసం రెండేళ్లుగా సమిష్టిగా పనిచేసాం. ప్రభుత్వ ఆలోచనల్ని అధికార యంత్రాంగం సమర్ధంగా అమలు చేసింది. క్షేత్రస్థాయిలో ఆశించిన మార్పుల్ని కొంతవరకు సాధించగలిగాం. మరిన్ని రంగాల్లో మరింతగా మెరుగుపడాలి.
అర్జీలు వేగంగా పరిష్కరించాలి….

‘గత పాలనలో కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగ్గా లేకపోవటంతో ప్రజల నుంచి పెద్దఎత్తున అర్జీలు వచ్చాయి. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ ద్వారా ఈ అర్జీలను వేగంగా పరిష్కరించి ప్రజలకు స్వాంతన కలిగించాలి. గత పాలకుల వల్ల రెవెన్యూ శాఖలో అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. భూ వివాదాలకు సంబంధించిన అర్జీలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సి వచ్చింది.
గోడలు దాటి వెళ్లాలి……
ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోనూ పర్యటించాలి. ప్రజల సమస్యలు, వాస్తవాలు తెలియాలంటే క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. వినూత్న ఆలోచనలతోనే సుపరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలి. మూడో ఏడాదిలోకి అడుగు పెట్టినప్పటికీ విద్యుత్ ఛార్జీలను పెంచలేదు. ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు.












Leave a Reply