NewsInn

News in a Click

ఫోన్ ట్యాపింగ్ కేసులో హ‌రీష్ కు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో హ‌రీష్ కు నోటీసులు

ప్ర‌భుత్వం కక్ష్య సాధింపు చ‌ర్య‌లు కేటిఆర్

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌)

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క నేత హ‌రీష్ రావ్ కు పోలీసులు విచార‌ణ‌ను పిలిచారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ కు విచార‌ణ‌కు రావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు నోటీసులు జారీ చేసిన స‌మ‌యంలో హ‌రీష్ రావ్ ఇంట్లో లేక‌పోవ‌డంతో ఆయ‌న కార్యాల‌యంలో నోటీసులను పోలీసులు అందించారు.

హ‌రీష్ రావ్ ను విచార‌ణ‌కు పిలువ‌డంపై కేటిఆర్ ప్ర‌భుత్వ తీరును త‌ప్పు బ‌ట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందన్నారు.అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీష్ రావు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి కి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని ఈరోజు బయటపెట్టినందుకే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ‘డైవర్షన్ పాలిటిక్స్’ తప్ప మరొకటి కాదని స్ప‌ష్టం చేశారు. బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుపై కక్ష సాధింపు లో భాగంగా ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని కేటిఆర్ ఆరోపించారు.

రేపు ఉదయం 9 గంట‌ల‌కు బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స‌హా కీల‌క నేత‌లంతా తెలంగాణా భ‌వ‌న్ కు చేరుకుంటారు. ఆ త‌రువాత తెలంగాణా భ‌వ‌న్ నుంచి హ‌రీష్ రావ్ జూబ్లీ హిల్స్ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *