చిట్ చాట్ లో హరీష్ రావ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరిగిన తీరును మాజీ మంత్రిహరీష్ రావ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పంచుకున్నారు. విచారణ సుధీర్ఘంగా జరిగినా సిట్ పెద్దగా ప్రశ్నలు అడగలేదన్నారు. సిట్ అడిగిన ప్రశ్నలే అడిగారని, ముగ్గురు అధికారులు విచారణ జరుపుతున్నా అరగంటకోసారి ఫోన్ మాట్లాడడంతోనే సరిపోయిందన్నారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల కంటే తాను సిట్ అధికారులను ప్రశ్నించానని హరీష్ రావ్ వ్యాఖ్యానించారు. సిట్ అధికారులకే వందల ప్రశ్నలు తాను సంధించానన్నారు. అప్పటి డీజీపీ, ఇంటెలీజెన్స్ చీఫ్ లను విచారణకు పిలువాలని తాను సిట్ అదికారులను ప్రశ్నించినట్లు హరీష్ వ్యాఖ్యలు చేశారు.నాకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదని స్పష్టం చేశానన్నారు. నేను హోంమంత్రి కూడా కాదన్న విషయాన్ని పోలీసులకు గుర్తు చేసినట్లు హరీష్ వెల్లడించారు.






Leave a Reply