స్థానిక నేతలకే ఎన్నికల బాధ్యతలు
మీడియాతో కేటిఆర్
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
త్వరలో జరుగబోయే మన్సిపల్ ఎన్నికలకు బీఆర్ ఎస్ సిద్ధంగా ఉందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా….ఆ పార్టీ అబ్యర్థులకు ముఖ్యమంత్రి ప్రచారం చేసినా….తాము 40 శాతం స్థానాలను గెలుచుకున్నామని ఈ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను స్థానిక నేతలకే అప్పగిస్తామన్నారు. నియోజకవర్గాలు, మున్సిపాల్టీల వారిగా ఇంచార్జ్ లు,సమన్వయ కర్తలను నియమిస్తామన్నారు. ఎన్నికలు పూర్తయిన నేతలకే ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లు కేటిఆర్ వెల్లడించారు. తెలంగాణా భవన్ లో కేటిఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చరు. ఎన్నికల కోసం అవసరమైన ప్రచార మెటీరియల్ అంతా సిద్ధంగా ఉందని, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపిక చేయాలని నేతలకు సూచించామని తెలిపారు. సర్వేలు కూడా చేయిస్తున్నామని, వాటి ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. స్థానిక నేతల ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదన్న అభిప్రాయన్ని కేటిఆర్ వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం గ్రేటర్ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.

జిల్లాల రద్దు మా అస్త్రం…..
జిల్లాలు తొలగిస్తారన్న ఆందోళన కొత్త జిల్లాల్లో తీవ్రంగా ఉందని, కాంగ్రెస్కు ఓటు వేస్తే జిల్లాల తొలగింపునకు అనుమతి ఇచ్చినట్లేనని ప్రజలకు వివరించనున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ అంశాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏమి చేసినా అది ఆయన ఇష్టమని, తమ పని తాము చేసుకుంటామని అన్నారు.





Leave a Reply