(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆరు హత్యలు చేసిన హంతకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. షాబాద్ మండలం దేవాల గూడ గ్రామంలో మూడు రోజుల క్రితం తన ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటు మరో కుటుంబంలోని ముగ్గురిని అర్ధరాత్రి సమయంలో మారణకాండకు పాల్పడ్డారు. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ లో సమాచారం ఇచ్చి పారి పోయారు. ఆ మరుసటి రోజు నుంచి పోలీసులు నిందితుడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. మూడు రోజులుగా పోలీసులు గాలించినా…ఎలాంటి పురోగతి సాధించలేదు. పక్కా ప్రణాళికతో హత్యలు చేశారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ కుమార్ వినియోగించే అన్ని ఫోన్లను ట్రాక్ చేస్తూ ఆయన ఆచూకీ కోసం ప్రయత్నం చేశారు. సెల్ ఫోన్ వాడకపోవడంతో పోలీసులకు మరింత టెన్షన్ పెరిగింది. షాబాద్ కు సమీపంలోనే జాతీయ రహదారిపై ఉన్న కొత్తూరు ప్రాంతానికి వెళ్లారని ప్రాథమికంగా సీసీ టీవీల ద్వారా పోలీసులు గుర్తించారు. కారులో పెట్రో ల్ అయిపోవడంతో…కారును అక్కడే వదలి వెళ్లిపోయారు. ఇంత వరకు పోలీసులు సమాచారం సేకరించిన రెండు రోజులుగా ఎలాంటి పురోగతి సాధించలేదు.
అయితే కేసును విచారిస్తున్న పోలీసుల దర్యాప్తులో ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూశాయి. చదవుకునే సమయంలో ట్యూషన్ వెళ్లి తన కంటే దాదాపు ఆరేళ్ల వయస్సులో ఎక్కువగా ఉన్న సరితను ప్రేమ వివాహం చేసుకున్నారు. మధ్యం తాగే అలవాటు ఉండడం భార్యా భర్తల మధ్య తరచూ వివాదాలు తలెత్తడం వంటివి చోటు చేసుకున్నాయని పోలీసులు గుర్తించారు. అయితే మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారని కేసు నమోదు కావడంతో ఇటీవలే జైలు కు వెళ్లి బేయిల్ పై బయటకు వచ్చారు. అటు కుటుంబంలో సహకారం లేకపోవడం… జైలుకు వెళ్లి రావడంతో పరువు పోయిందని కొన్ని రోజులుగా రాజ్ కుమార్ రగిలిపోయారని సన్నిహితుల ద్వారా పోలీసులు సమాచారం సేకరించారు. ఈ పరిస్థితుల్లో ధారుణ హత్య కాండ కు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ఆరు హత్యలు చేసిన అనంతరం రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్లారో పోలీసులు తెలుసుకోలేకపోయారు. విస్తృతంగా పోలీసు బృందాలను రంగంలోకి దించి గాలిస్తుండగా రాజ్ కుమార్ మేన మామ ఊరైన పంజెర్ల సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ లో గుర్తు తెలియని శవం ఉందన్న సమాచారం పోలీసులకు అందిందింది. మృతదేహం పక్కనే క్రిమి సంహారక మందు డబ్బా కూడా ఉండడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అది రాజ్ కుమార్ మృత దేహంగా గుర్తించారు. ఆరు హత్యలు చేసిన తరువాత తన తల్లి దండ్రులకు తాను కూడా చనిపోతానని సమాచారం ఇచ్చారు. దీంతో రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారిస్తున్నారు.












Leave a Reply