NewsInn

News in a Click

ఆ న‌లుగురే కార‌ణం-అనాధాల్లా భావించండి

ఆ న‌లుగురే కార‌ణం-అనాధాల్లా భావించండి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలుగు రాష్ట్రాల్లో సంచల‌నం సృష్టించిన ఆరు హ‌త్య‌ల కేసులో నిందితుడి వీడియో వెలుగు చూడ‌డం ఈ మార‌ణ కాండ‌లో కొత్త కోణాల‌ను తెర‌పైకి తెస్తోంది.ఈ ఎపిసోడ్ లో త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని భ‌రించ‌లేక తాను ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని రాజ్ కుమార్ సెల్ఫీ వీడియోలో చెప్పారు. తన భాగానికి వ‌చ్చిన భూమిని మొత్తం అమ్మి తాను తీవ్రంగా న‌ష్ట‌పోయాన‌ని ఆ న‌ష్టాన్ని భ‌రించ‌డంతో పాటు పై నుంచి కేసులు కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌న్నారు. ఈ ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో తాను ఈ క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. 10వ తేదీ సాయంత్రం 5 గంట‌ల ప్రాంతంలో సెల్ఫీ వీడియో తీసుకున్న‌ట్లు వీడియోను ప‌రిశీలిస్తే స్ప‌ష్టంగా తెలుస్తోంది. త‌న కుటుంబ స‌భ్యుల‌కు ఇందులో ఎలాంటి ప్ర‌మేయం లేద‌న్నారు. ఆ అమ్మాయిని న‌మ్మి త‌న కుటుంబ స‌భ్యుల‌కు అన్యాయం జ‌రిగింద‌న్నారు. దీంతో అన్యాయంతో త‌న పిల్ల‌లు రోడ్డుపైకి వచ్చే ప‌రిస్థితి తెచ్చార‌న్నారు. ఈ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని క‌ఠిన నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌లేద‌న్నారు. త‌న‌కు అన్యాయం చేసిన కుటుంబాన్ని హ‌త్య చేసి….త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చావాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వీడియోలో పేర్కొన్నారు.

తాను తీసుకున్న నిర్ణ‌యానికి త‌న కుటుంబ స‌భ్య‌ల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశారు.ఈ ప‌రిస్థితి ఇంత వ‌ర‌కు రావ‌డానికి కార‌ణం అమ్మాయి కుటుంబ స‌భ్యులు రాజు, శ్రీను, సంగీత‌, న‌రి అనే న‌లుగురు కార‌ణ‌మ‌ని చెప్పారు. ఈ మార‌ణ కాండ‌కు ఆ నల‌గురే కార‌ణ‌మ‌న్నారు. త‌న‌కు భూమి లేక‌పోవ‌డంతో….త‌న త‌ల్లిదండ్రుల భూముల్లో త‌మ కుటుంబ స‌భ్యుల అంత్య‌క్రియ‌లు చేయ‌రాద‌ని, అనాధాలుగా భావించి అంత్య క్రియ‌లు చేయాల‌ని కోరారు. తాను చేసిన త‌ప్పుల‌కు తానే శిక్ష‌ను అనుభ‌వించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని వీడియో లో చేప్పారు. ఈ ప‌రిస్థితికి కార‌ణ‌మైన ఆ న‌లుగురిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వీడియో ద్వారా కోరారు.

రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో బ‌య‌ట ప‌డ‌డంతో ఇప్పుడు పోలీసులు ఎలా వ్య‌వ‌మ‌రిస్తారా అన్న‌ది అంద‌రిలోనూ ఆస‌క్తిరేపుతున్న అంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *