(హైదరాబాద్,న్యూస్ఇన్)
షాబాద్ లో ఆరు హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న రాజ్ కుమార్ ఎక్కడ అనే ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి. ప్రధానంగా పోలీసులకు అత్యంత ప్రాధాన్యతగా మారింది. సంచలనం సృష్టించినీ కేసులో రాజ్ కుమార్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. పొరుగు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసుల దృష్టికి ఆసక్తి కర అంశాలు తెరపైకి వచ్చాయి. హత్యలు చేసిన అనంతరం కారులో తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇంధనం అయిపోవడంతో కారు ను కొత్తూరు సమీపంలో వదిలి వెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కారు ఆగిపోయిన తరువాత తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లు సమాచారం అందింది. ఆ తరువాత రాజ్ కుమార్ గురించి పోలీసులకు ఎలాంటి సమాచారం అందడం లేదు కాని పోలీసులు కీలక అంశాలను గుర్తించినట్లు తెలుస్తోంది.

ఫోన్లు స్విఛ్చాఫ్….
రాజ్ కుమార్ పక్కా ప్రణాళికతో ఈ హత్యాకాండను అమలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన వద్ద సుమారు మూడు మొబైల్ ఫోన్లు, 12 కి పైగా వేర్వేరు సిమ్ కార్డులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు గుర్తిస్తారన్న భయంతో ఆ ఫోన్లను, సిమ్ కార్డులను వాడటం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా ఒక సిమ్ కార్డ్ ఆన్ చేసినా వెంటనే అరెస్టు చేయాలన్న లక్ష్యంగా ట్రాక్ చేస్తున్నారు.
పోలీసుల గాలింపు…..
పోలీసులు దీన్ని సీరియస్ గా పరిగణిస్తుండడంతో…. పోలీసులు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇప్పటికే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. రాజ్కుమార్ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఎక్కువగా ఉండే అలవాటు ఉండడంతో….. అక్కడ సాధువుల రూపంలో గానీ, భక్తుల మధ్య గానీ దాక్కునే అవకాశం ఉందని భావించి శ్రీశైలంలో ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.
.












Leave a Reply