ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకన్నన్ తో నారా లోకేష్
(అమరావతి,న్యూస్ఇన్)

దావోస్ (స్విట్జర్లాండ్): ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకన్నన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. విస్తృతమైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు కలిగిన విశాఖపట్నంలో శాశ్వత ఉబెర్ టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటు చేయండి. రవాణా మౌలిక సదుపాయాల ప్రణాళిక, పట్టణ మొబిలిటీ నిర్వహణ, లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్ లో ఉబర్ ప్లాట్ఫారమ్లు, డేటా విశ్లేషణలపై దృష్టిసారించిన ఉబెర్… ఏపీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్మాణాత్మక సాంకేతిక సహకారాన్ని అందించండి. విశాఖలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ద్వారా గ్లోబల్ సేఫ్టీ ఫీచర్ ఇన్నోవేషన్ లపై దృష్టిసారించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఉబెర్ వైస్ ప్రెసిడెంట్ మధుకన్నన్ స్పందిస్తూ… భారత్ లో 2013 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ … దేశంలోని 129 నగరాల్లో సేవలందిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద మొబిలిటీ మార్కెట్ లో ఒకటిగా ఉన్నాం. భారత్ లో మల్టీమోడల్ మొబిలిటీ, డెలివరీ సేవలు (రైడ్ హైలింగ్, ఉబెర్ ఈట్స్, ఉబెర్ డైరెక్ట్, ఇంటర్ సిటీ ట్రావెల్) అందిస్తున్నాం. ఉబెర్ ఇంటర్ సిటీ దేశవ్యాప్తంగా 3వేలకు పైగా మార్గాల్లో పనిచేస్తోంది. మిలియన్ కంటే ఎక్కువగా డ్రైవర్, డెలివరీ భాగస్వాములతో దేశవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థ, సౌకర్యవంతమైన ఉపాధి కల్పనకు దోహదపడుతున్నాం. ప్రస్తుతం బెంగుళూరు, హైదరాబాద్ లలో మేజర్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్ హబ్ లను నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆండ్రూ మెక్ డోనాల్డ్ తెలిపారు.






Leave a Reply