NewsInn

News in a Click

డెవలప్ మెంట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టండి

బ్లాక్ స్టోన్ ఛైర్మన్ స్టీఫెన్ ఎ. స్క్వార్జ్‌మాన్ తో మంత్రి లోకేష్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

బ్లాక్ స్టోన్ ఛైర్మన్ & సీఈవో, సహ వ్యవస్థాపకుడు స్టీఫెన్ ఎ. స్క్వార్జ్‌మాన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఎంబసీ ఆఫీస్ పార్క్స్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ వంటి సంస్థల ద్వారా విశాఖపట్నంలో గ్రేడ్ ఎ ఆఫీస్ స్పేస్, ఇంటిగ్రేటెడ్ మిక్స్ డ్ యూజ్ డెవలప్ మెంట్ లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించండి.

మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ సప్లయ్ చైన్స్, పోర్టు లింక్డ్ లాజిస్టిక్స్, రీజనల్ డిమాండ్ ను లక్ష్యంగా చేసుకుని చెన్నై – బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ), విశాఖపట్నం-చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ)ల పరిధిలో ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధిపై దృష్టిసారించండి. పెరుగుతున్న పట్టణీకరణ, వ్యవస్థీకృత రిటైల్ వృద్ధి, కార్యాలయాల ఆధారిత వినియోగాన్ని అందిపుచ్చుకోవడానికి, అమరావతితో సహా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో సంస్థాగత స్థాయి రిటైల్, బహుళ-వినియోగ ఆదాయాన్ని సృష్టించే వాణిజ్య సముదాయాల ఏర్పాటును పరిశీలించండి. తీరప్రాంత కనెక్టివిటీ, స్కేలబుల్ విద్యుత్ లభ్యత, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ హబ్‌గా ఉన్న విశాఖపట్నంలో హైపర్‌స్కేల్ డేటా-సెంటర్ పెట్టుబడులను పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. బ్లాక్ స్టోన్ ఛైర్మన్ స్టీఫెన్ ఎ. స్క్వార్జ్‌మాన్ స్పందిస్తూ… పంచశీల్ రియల్టీతో కలిసి, నవీ ముంబైలో సుమారు 500 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా-సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తున్నామని, దీనిపై సుమారు రూ.20వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *