అంబటి రాంబాబు హత్యకు టీడీపి కుట్ర
పార్టీ అండగా ఉంటుందని భరోసా
(అమరావతి,న్యూస్ఇన్)
మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై టీడీపి నేతలు దాడి చేసి ధ్వంసం చేయడంతో పాటు అంబటిని అరెస్టు చేశారు. అంబటి అరెస్టుపై వైసీపీ నేతలు ఇప్పటి వరకు ఘాటుగా స్పందించిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ మంత్రి కుటుంబానికి భరోసా కల్పించారు. , గుంటూరులోని అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్ను సందర్శించి, ఆ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశారు. అంబటి కారును ఏ విధంగా ధ్వంసం చేసింది చూసిన ఆయన, దాడి ఏ స్థాయిలో చేశారనేది కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అంబటి రాంబాబు భార్య, కుమార్తెలు, కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించిన జగన్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్ తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ ఖూనీ చేసిందని….జంగిల్ రాజ్ లా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు, జోగిరమేష్, విడుదల రజినీ, బొల్ల బ్రహ్మనాయుడు ఇళ్ల మీద జరుగుతున్న దాడులు ఇందుకు నిదర్శనమని జగన్ అన్నారు. రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీ పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదంలో భక్తల మనోభావాలు దెబ్బతినే విధంగా దుష్ప్రచారం చేసిందన్నారు. చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ , పవన్ కళ్యాణ్ ను స్వామి వారి ప్రతిష్టను దెబ్బతీసేలా భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన ల్యాబ్ రిపోర్టుల్లో జంతువుల కొవ్వు లాంటి అవశేషాలు లేవని నివేదిక ఇచ్చిందని జగన్ తెలిపారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన బాబు,లోకేష్, పవన్ లు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పనితీరుపై ఎవరు గట్టిగా ప్రశ్నించినా దాడులు చేస్తున్నారని జగన్ విమర్శించారు. అంబటి కంటే ధారుణంగా బాబు, పవన్ లు మాట్లాడుతున్నారని జగన్ అన్నారు. అంబటి రాంబాబుతో పాటు జోగి రమేష్ ఇంటి మీద పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారని ఇంది ఎంత వరకు సమంజసమన్నారు. విడుదల రజినిపై దాడి చేసి మళ్లీ ఆమెపై నే తప్పుడు కేసులు పెట్టడం ఎంత వరకు సమంజమని జగన్ ప్రశ్నించారు.







Leave a Reply