భారత జట్టును కట్టడి చేసిన ఆమెరికా
29 పరుగుల తేడాతో భారత్ విజయం
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత్ జట్టు ప్రారంభం ఆశించినట్లు జరుగలేదు. భారత బ్యాట్స్ మెన్సు ఫుల్ ఫాంలో ఉన్న మొదటి మ్యాచ్ లో పెవీలియన్ వచ్చేందుకు పోటీ పడ్డట్లు ఆడారు. ఓపెనర్ల నుంచి 20 ఓవర్లు పూర్తయ్యే వరకు కెప్టన్ సూర్యకుమార్ యాదవ్ మినహా అంతా అతి తక్కువ స్కోరుకే పరిమితం అయ్యారు.అమెరికా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ జట్టు అంచనాల ప్రకారమే బలమైన భారతజట్టును మొదటి బంతి నుంచి కట్టడి చేస్తూ వచ్చారు. రెండో ఓవర్ కు వచ్చే వరకు భారత స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ పరుగులు ఏమి చేయకుండా పేవిలియన్ చేరుకున్నారు. ఆ తరువాత ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు కొద్ది సేపు ఆచితూచి ఆడుతూ భారత జట్టును ముందుకు తీసుకెళ్లే యత్నం చేశారు.5.2 ఓవర్లలో స్కోరు 45 పరుగులకు చేరుకుంది. ఆ సమయంలో 20 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ఔటయ్యారు. ఆ వెంటనే తిలక్ వర్మ ఔట్ అయ్యారు. బ్యాటింగ్ కు వచ్చిన శివమ్ దుమే తొలిబంతికే వెనుదిరిగారు. దీంతో 46పరుగలకే 4 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. అప్పటి నుంచి కెప్టన్ సూర్య కుమార్ యాదవ్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేసేందుకు ప్రాధాన్యతనిచ్చారు. 72 పరుగుల వద్ద భారత్ జట్టు 5వ వికెట్,77పరుగుల వద్ద 6వ వికెట్ రూపంలో హార్ధిక్ పాండ్యా వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. 7వ వికెట్ భాగస్వామ్యంగా అక్షర్ పటేల్ తో కలిసి 118 పరుగులకు స్కోరు చేరింది.అప్పటికీ 16.4 ఓవర్లు పూర్తి కావడంతో అక్షర్ అవుట్ అయ్యారు.

ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన అర్షదీప్ సింగ్, వరణ్ చక్రవర్తితో కలిసి భారత జట్టు స్కోరును 161 పరుగల వరకు సూర్య కుమార్ యదవ్ చేర్చారు.49 బంతుల్లో 84 పరుగులు చేసి కెప్టన్ ఇన్నింగ్స్ తో భారత్ ను ఆదుకున్న సూర్య నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో శాండ్లీ వాన్ 25 పరుగులు ఇచ్చి 4 భారత జట్టు వికెట్లు పడగొట్టగా హర్మీత్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆమెరికా మొదట్లోనే వికెట్లు కోల్పోయింది. 1.4 ఓవర్లలో 8 పరుగల వద్ద తొలికెట్ యూఎస్ ఏ కోల్పోయింది. 11 పరుగుల వద్ద రెండో వికెట్, 13 పరుగుల వద్ద మూడో వికెట్ ను యూఎస్ఏ జట్టు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తిలు యూఎస్ జట్టు విజయంపై ఆశలు రేపారు. వికెట్లు కోల్పోకుండా బ్యాటింగ్ చేస్తూ… 74 పరుగుల వరకు స్కోరు ను చేర్చిన తరువాత మిలింద్ కుమార్ 34 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఫాం లో కనిపించిన సంజయ్ కృష్ణమూర్తి 31 బంతుల్లో 37 పరుగులు చేసి వెనుదిరిగారు. అప్పటికీ యూఎస్ ల ఏజట్లు స్కోరు 15.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. అదే స్కోరు వద్ద 6వ వికెట్ కోల్పోయింది.18 ఓవర్లలో 7 వికెట్ భాగస్వామ్యానికి 110 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో అమెరికా జట్టు విజయం సాధించలాంటే భారీగా రన్ రేట్ అవసరమైంది.19 ఓవర్లు పూర్తయ్యే సరికి 122 పరుగులు చేసింది. చివరి ఓవర్లో 40 పరుగులు చేయాల్సి ఉండడంతో ఇక భారత్ విజయం లాంఛనంగానే మారింది. చివర్లో శుభం రంజన్ బ్యాటింగ్ లో రాణించి 22 బంతుల్లో 37 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి అమెరికా జట్టు 132 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో సిరాజ్ 3, అర్షదీప్, అక్షర్ పటేల్ లు చెరో రెండు వికెట్లు సాధించారు.
బలమైన భారత జట్టుతో అన్ని విభాగాల్లో రాణించి అమెరికా జట్టు మ్యాచ్ ఓడినా ఆ జట్టు అభిమానుల మద్దతు కూడగట్టుకుంది.








Leave a Reply