మూడు రోజుల్లో రూ.8.06 కోట్ల ఆదాయం
(వరంగల్,న్యూస్ఇన్)

సమ్మక్క–సారక్క జాతర–2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు మూడో రోజు కూడా హనుమకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో కొనసాగింది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.జాతరకు సంబంధించి మొత్తం 828 హూండీలు ఏర్పాటు చేయగా, ఇందులో 780 ఇనుప హూండీలు, 45 వస్త్ర హూండీలు, 3 బియ్యం హూండీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మూడో రోజు 140 హూండీలను తెరిచి లెక్కించగా, వాటి ద్వారా రూ.2,01,21,440/- ఆదాయం లభించింది. అదనంగా విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా రూ.71,283/- ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.
• ఫిబ్రవరి 5న 125 హూండీల లెక్కింపులో రూ.2,49,65,000/-,
• ఫిబ్రవరి 6న 160 హూండీల లెక్కింపులో రూ.3,54,25,200/-తో పాటు విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా రూ.63,436/- ఆదాయం లభించింది.
మూడు రోజుల వ్యవధిలో మొత్తం 425 హూండీలను లెక్కించగా, కలిపి రూ.8,06,46,359/- ఆదాయం సమకూరినట్లు అధికారులు స్పష్టం చేశారు.మూడో రోజు లెక్కించిన నగదులో నుంచి రూ.2,01,92,723/- మొత్తాన్ని పర్యవేక్షణాధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. బంగారం, వెండి కానుకలను వేర్వేరుగా ఇనుప హూండీలలో భద్రపరచి భద్రంగా ఉంచినట్లు పేర్కొన్నారు. నాణేల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదని వెల్లడించారు.


Leave a Reply