NewsInn

News in a Click

సమ్మక్క–సారక్క జాతర హూండీల లెక్కింపు

మూడు రోజుల్లో రూ.8.06 కోట్ల ఆదాయం

(వ‌రంగ‌ల్,న్యూస్ఇన్‌)


సమ్మక్క–సారక్క జాతర–2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు మూడో రోజు కూడా హనుమకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో కొనసాగింది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.జాతరకు సంబంధించి మొత్తం 828 హూండీలు ఏర్పాటు చేయగా, ఇందులో 780 ఇనుప హూండీలు, 45 వస్త్ర హూండీలు, 3 బియ్యం హూండీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మూడో రోజు 140 హూండీలను తెరిచి లెక్కించగా, వాటి ద్వారా రూ.2,01,21,440/- ఆదాయం లభించింది. అదనంగా విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా రూ.71,283/- ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.
• ఫిబ్రవరి 5న 125 హూండీల లెక్కింపులో రూ.2,49,65,000/-,
• ఫిబ్రవరి 6న 160 హూండీల లెక్కింపులో రూ.3,54,25,200/-తో పాటు విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా రూ.63,436/- ఆదాయం లభించింది.

మూడు రోజుల వ్యవధిలో మొత్తం 425 హూండీలను లెక్కించగా, కలిపి రూ.8,06,46,359/- ఆదాయం సమకూరినట్లు అధికారులు స్పష్టం చేశారు.మూడో రోజు లెక్కించిన నగదులో నుంచి రూ.2,01,92,723/- మొత్తాన్ని పర్యవేక్షణాధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. బంగారం, వెండి కానుకలను వేర్వేరుగా ఇనుప హూండీలలో భద్రపరచి భద్రంగా ఉంచినట్లు పేర్కొన్నారు. నాణేల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *